Switch to English

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ విషయాలపై ఎప్పటికప్పుడు జనసేన పార్టీలో అంతర్గత సర్వేలు జరుగుతున్నాయి.

అలాగే, కూటమి తరఫున టీడీపీ కూడా ఎప్పటికప్పుడు మొత్తంగా 175 నియోజకవర్గాల్లోనూ సర్వేలు నిర్వహిస్తూనే వుంది. మరోపక్క, అధికార వైసీపీ చేయిస్తున్న సర్వేల సంగతి సరే సరి. వీటన్నిటికీ అదనంగా, వేర్వేరు మీడియా సంస్థలూ సర్వేలు నిర్వహిస్తున్నాయి.

కాగా, జనసేన పార్టీ పోటీ చేస్తున్న మొత్తం 21 స్థానాల్లో 11 స్థానాల్లో జనసేన పార్టీ చాలా చాలా స్ట్రాంగ్‌గా వుందని నామినేషన్లు మొదలయ్యే రోజున వెలుగు చూసిన తాజా సర్వే ఒకటి చెబుతోంది. వీటిల్లో జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురంతోపాటు, అనకాపల్లి, పెందుర్తి, కాకినాడ రూరల్, పి. గన్నవరం, రాజోలు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం, తెనాలి, అవనిగడ్డ నియోజకవర్గాలున్నాయి.

కాగా, నెల్లిమర్ల నియోజకవర్గం అలాగే వైజాగ్ సౌత్, యలమంచిలి, నిడదవోలు, రాజానగరం నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి గట్టి పోటీ వున్నా, జనసేనకే ఎడ్జ్ కనిపిస్తోంది. తిరుపతి, పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో జనసేన స్ట్రాంగ్‌గానే వున్నా, ఎడ్జ్ మాత్రం వైసీపీకి కనిపిస్తోంది. పాలకొండ, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో జనసేన ప్రస్తుతానికి ఏమంత బలంగా కనిపించడంలేదు.

అయితే, నామినేషన్ల పర్వం తర్వాత అసలు సిపలు క్యాంపెయినింగ్ షురూ అవుతుంది గనుక.. పోటీ ఇప్పుడే మరింత రసవత్తరంగా మారబోతోంది. 1‌00 పర్సంట్ స్ట్రైక్ రేట్‌తో జనసేన మొత్తం 21 సీట్లూ కైవసం చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది.

అయితే, ఈ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు తూతూ మంత్రంగానే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి. వైసీపీ అభ్యర్థుల ప్రచారానికి జనం నుంచి కనీసపాటి స్పందన కనిపించకపోవడంతో, వైసీపీ క్యాడర్ డీలాపడుతోందిట.

కాగా, లోక్ సభ నియోజకవర్గాల విషయానికొస్తే, జనసేన పార్టీ రెండు సీట్లలోనూ విజయ దుందుభి మోగిస్తుందని ఇప్పటికే పలు సర్వేలు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించి కేవలం మెజార్టీ గురించిన చర్చే జరుగుతోంది.

జనసేన పార్టీకి సంబంధించి వెరీ వెరీ స్పెషల్ నియోజకవర్గంగా మారిపోతోంది నెల్లిమర్ల. ఇక్కడ వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ తొలుత అనుకున్నా, జనసేన అభ్యర్థి లోకం మాధవి, ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా వైసీపీని ఖాళీ చేయించడంలో లోకం మాధవి అనుసరిస్తున్న వ్యూహాలు సత్ఫలితాలనిస్తున్నాయి. అధికార వైసీపీకి, ఈ నియోజకవర్గ సమీకరణాలు అస్సలు అంతు పట్టకుండా పోతున్నాయ్. ఇదో సంచలన నియోజకవర్గంగా ముందు ముందు మారే అవకాశాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...