జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. వాస్తవానికి, పిఠాపురం వెళ్ళేముందే ఆయన జ్వరంతో బాధపడ్డారు. ముందుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుని వుండడంతో, పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అదీ జ్వరంతోనే.
పార్టీ ముఖ్య నేతలు వారిస్తున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మండుటెండల్లోనే ఇంటింటి ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తీవ్ర జ్వరం బారిన పడ్డారు. వైద్యులు ఆయనకువ వైద్య చికిత్స అందించారు. రెండు మూడు రోజులపాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.
ఇక, ఇప్పుడు మొదలైంది వైసీపీ మార్కు రాజకీయం. ఒక్క రోజు ఎండలో తిరిగినందుకే జ్వరం బారిన పడ్డారు పవన్ కళ్యాణ్.. మరి, అవ్వా తాతలు ఎండలో పెన్షన్ల కోసం ఎలా వెళతారు.? అంటూ రాజకీయం మొదలెట్టేసింది వైసీపీ. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా వుంటుందా.?
అసలు సామాజిక పెన్షన్లు – వాలంటీర్ వ్యవస్థ.. ఇది చాలా పెద్ద డిబేట్. యాభై కుటుంబాలకు ఓ వాలంటీర్.. ఆ వాలంటీర్కి గౌరవ వేతనం, సాక్షి పత్రిక, ఓ మొబైల్ ఫోన్.. ఇదంతా పెద్ద తతంగం. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు సందర్భాల్లో చెప్పారు.
ఆర్థిక సంవత్సరం పూర్తయిన దరిమిలా, బ్యాంకులకు సెలవులు రావడంతో.. ప్రభుత్వం నుంచి బ్యాంకుల్లో పెన్షన్ నగదు జమ అవడం ఆలస్యమయ్యింది. మూడో తేదీ తర్వాత పెన్షన్ల పంపిణీ.. అని ప్రభుత్వమే ప్రకటించింది. రెండ్రోజులు హైడ్రామాకి తెరలేపింది వైసీపీ.. ఈ అవకాశాన్ని చూసుకుని.
జనసేన పార్టీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా పూనుకుని, వృద్ధుల్ని గ్రామ సచివాలయాల దగ్గరకు తీసుకెళ్ళి మరీ పెన్షన్లు ఇప్పించారు. ఇంతకీ, వైసీపీ కార్యకర్తలు ఏం చేసినట్టు.? ఇంకేం చేస్తారు.. నిస్సిగ్గు రాజకీయమే చేస్తారు. అదే చేశారు కూడా.!
ఇంకోపక్క, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారనీ, జ్వరం అనేది నాటకమనీ వైసీపీ విష ప్రచారానికి తెరలేపింది. వైసీపీ అంటేనే విష ప్రచారం.! పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్కి లక్ష మెజార్టీ ఖాయమన్న ప్రచారం దరిమిలా, వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోంది. ఈ క్రమంలోనే వాలంటీర్ల రచ్చ.. పెన్షన్ల పేరుతో హైడ్రామా.. సినిమా షూటింగులంటూ విష ప్రచారం.. ఇంత రోగిష్టి రాజకీయాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందన్నమాట.
ఇప్పుడే ఏమైంది.? ముందు ముందు చాలా చాలా నీఛ నికృష్ట రాజకీయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నుంచి చూడబోతున్నాం. పెన్షన్ నాటకంలో భాగంగా, 31 మంది వృద్ధులు చనిపోయారంటూ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం అత్యంత హేయం.
శవం కనిపిస్తే చాలు, రాజకీయం చేసే వైసీపీ, ఏ అనారోగ్య సమస్యతో ఎవరు చనిపోయినా అక్కడ వాలిపోయి.. శవ రాజకీయాల్ని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా చేసేస్తోంది. కాదేదీ వైసీపీ రాజకీయానికి అనర్హం.!