అనూహ్యం.. అద్భుతం.. అబ్బే, ఇవి చాలవు. ఇంకా గొప్ప గొప్ప పదాల్ని వాడాల్సి వుంటుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్.. ఇలా అన్ని మతాల్నీ సమానంగా గౌరవిస్తూ, ఆయా ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తూ, మత సామరస్యాన్ని చాటి చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో.
ఓ వైపు ఎండలు మండిపోతున్నాయ్.. కానీ, ఇవేవీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంతో మమేకం కాకుండా ఆపలేకపోతున్నాయ్. వేలాదిగా జనం పోగవుతున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా. వారిని అదుపు చేయడం భద్రతా సిబ్బందికి కష్టమవుతోంది.
మధ్యలో వైసీపీ పెంచి పోషిస్తోన్న బ్లేడ్ బ్యాచ్ గోల ఒకటి. సెక్యూరిటీ సిబ్బంది గాయడపతున్నారట ఆ బ్లేడ్ బ్యాచ్ కారణంగా. పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
అయినాగానీ, పవన్ కళ్యాణ్ జనంతో మమేకమవుతూనే వున్నారు. ఇంటింటికీ వెళ్ళి జనసేనాని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వృద్ధులు, యువత, మహిళలు, వికలాంగులు, చిన్న పిల్లలు.. ఇలా అందరూ జనసేనానికి బ్రహ్మరథం పడుతున్నారు.
పిఠాపురం ప్రజలు తమ సమస్యల్ని జనసేనానికి విన్నవించుకుంటున్నారు. గెలిచాక, ఆయా సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాననీ, పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలంగా చేసుకుంటానని ప్రజలకు భరోసా ఇస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
కాగా, బహిరంగ సభ కోసం అధికారుల నుంచి అనుమతులు కష్టమవుతున్నాయనీ, ఈ క్రమంలో రాజకీయ ప్రసంగాలు చేయలేకపోతున్నాననీ జనసేనాని పవన్ కళ్యాణ్, పిఠాపురంలో మహిళలతో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం.
లక్షకు పైన మెజార్టీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ని గెలిపించుకుంటామని పిఠాపురం ప్రజలు అంటున్నారు. పిఠాపురంపై రాయలసీమ రౌడీలను వైసీపీ ప్రయోగిస్తోందనీ, భయపడటానికి పులివెందుల కాదనీ, పిఠాపురం ప్రజలు.. రాయలసీమ రౌడీయిజాన్ని తిప్పికొట్టగలదని పిఠాపురం ఓటర్లు నినదిస్తున్నారు.