Switch to English

అమరావతి రగడ: వైసీపీ అమాయకత్వానికి జాలిపడాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ జగన్ సర్కారు ఆలోచన ఏంటి.? అన్నదానిపై వైసీపీ శ్రేణులకైనా ఓ స్పష్టత వుందా.? లేదా.? రాష్ట్ర ప్రజలు ఈ విషయమై ఒకింత గందరగోళానికి గురవుతున్నారు. చంద్రబాబు హయాంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన విషయం విదితమే. అది, చంద్రబాబు సొంత ప్రకటన కాదు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా జరిగిన తీర్మానం.

అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ కలిసి అసెంబ్లీలో కూర్చుని తీర్మానించుకున్న రాజధాని అంశమది. కానీ, ఇప్పుడు సీన్ మారింది.! అన్నట్టు, ఇప్పుడూ రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం జరిగింది. కానీ, తీర్మానించుకున్నది వైసీపీ మాత్రమే. దాన్ని ఇతర రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయ్. అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చిన అమారావతి ఓ వైపు, కేవలం వైసీపీ తీర్మానించుకున్న మూడు రాజధానులు ఇంకో వైపు.

నిజానికి, మూడు రాజధానుల విషయమై తాము తీర్మానించిన తీర్మానాన్ని తామే వెనక్కి తీసుకున్న చరిత్ర వైసీపీది. కొత్త తీర్మానం పెట్టకుండానే, మూడు రాజధానులంటూ ప్రజల్ని ఏమార్చుతోంది అధికార వైసీపీ. మంత్రి రోజా తాజాగా మూడు రాజధానుల విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి సందర్భంగా దేవాలయాల్లో మూడు రాజధానుల కోసం పూజలు చేయాలట.

ఇంకో మంత్రి బొత్స సత్యనారాయణ, మూడు రాజధానులకు అనుకూలంగా ప్రజలు నినదించాలనీ, అమరావతి కోసం పట్టుబడుతున్న రైతుల్ని అడ్డుకోవాలనీ పిలుపునిస్తున్నారు. మరో మంత్రి దాడిశెట్టి రాజా అయితే అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుని తీరతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఒక్కరంటే ఒక్కరికి కూడా సోయ వున్నట్లు కనిపించడంలేదు.. అందుకే అమరావతిని ‘కమ్మరావతి’ అంటున్నారు, అదసలు రాజధానే కాదు, స్మశానం.. ఎడారి.. ముంపు ప్రాంతం.. అంటూ ఏవేవో విమర్శలు చేస్తున్నారు.

విజయదశమినాడే.. చంద్రబాబు హయాంలో అమరావతికి శంకుస్థాపన జరిగింది. దేశంలోని చాలా పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, నీరు తీసుకొచ్చి.. పెద్ద పెద్ద హోమాలు నిర్వహించారు రాజధానికోసం. అలా ఏర్పడ్డ రాజధాని అమరావతి మీద రాజకీయం విషం చిమ్ముతోంది. అలాంటిది, మళ్ళీ మూడు రాజధానుల కోసం పూజలట.. అది కూడా అమరావతి మీద విషం చిమ్ముతున్నోళ్ళు చెబుతున్నారు పూజలు చేయాలని.

జనం వెర్రి వెంగళప్పల్లా కనిపిస్తున్నారా.? ఇదీ జనం నుంచి వస్తోన్న ప్రశ్న. అసలంటూ అధికార వైసీపీకి సోయ వుందా.? లేదా.? అని జనం నిలదీసే పరిస్థితి వచ్చేసింది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...