దేశంలో ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు విధిస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఆంక్షలు విధిస్తూ కొత్త సంవత్సరంలో జీఓ నెంబర్ 1ని విడుదల చేసింది. ఈక్రమంలో బహిరంగ సమావేశాలు, సభలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, ర్యాలీలపై జనవరి 10వ తేదీ వరకూ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
శనివారం రోజున డీజీపీ మహేందర్ రెడ్డితోపాటు ఉన్నతస్థాయి అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ కోవిడ్ పరిస్థితులపై జరిపిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు, తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతూండడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాజకీయ సభలు, సమావేశాలు, సాంస్కృతిక, మతపరమైన సభలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వొద్దని అధికారులకు సీఎస్ సూచించారు. ప్రజా రవాణా, దుకాణాలు మాల్స్, బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం, మాస్కులు తప్పనిసరి చేయాలని.. మాస్కులు పెట్టుకోకపోతే వెయ్యి జరిమానా విధింపును కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.
577215 928206I gotta bookmark this website it seems extremely beneficial very valuable 632248
688458 874697I enjoy reading post. Hope i can locate more articles like this one. Thanks for posting. 740480
265837 924544just couldnt leave your internet website before suggesting that I actually loved the normal info a person offer for your visitors? Is gonna be again ceaselessly to check up on new posts 771634