చరిత్రలో కొన్నింటిని ఎవరూ ఎప్పటికి మర్చిపోలేరు. అవి మనుషులపైన, సమాజంపైన చెరగని ముద్రను వేస్తాయి. అలాంటి వాటిల్లో నవంబర్ 26 ఒకటి. నవంబర్ 26వ తేదీ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది 11 ఏళ్ల క్రితం ముంబైలో జరిగిన మారణహోమం. ముంబైలోని తాజ్ మహల్ హోటల్, రైల్వే స్టేషన్, నారీమన్ హౌస్ లలో పాక్ కు చెందిన కొందరు ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అనేకమంది అమాయక ప్రజలు మరణించారు.
సముద్రమార్గం గుండా ఇండియాలోకి ప్రవేశించి మారణహోమాన్ని సృష్టించారు. అయితే, దాడులు చేసిన అందరిని మన సైనికులు మట్టుపెట్టారు అది వేరే విషయం. అసలు పాక్ నుంచి మందుగుండు సామాగ్రితో ముంబై తీరంలోకి రావడమే ఒక డేరింగ్ స్టెప్. వచ్చిన తరువాత ఆయుధాలతో ఎలా హోటల్ లోకి ప్రవేశించారు తెలియలేదు. మొత్తానికి నవంబర్ 26 వ తేదీన ముంబైలో రక్తపాతం జరిగింది. దీని గురించే అందరికి తెలుసు.
సరిగ్గా 70 ఏళ్ళక్రితం అంటే 1949 నవంబర్ 26 వ తేదీన అప్పటి ఇండియా ప్రభుత్వం రాజ్యాగాన్ని ఆమోదించింది. రాజ్యాంగాన్ని ఆమోదించినా దానిని దేశవ్యాప్తంగా అమలు చేసింది మాత్రం జనవరి 26 నుంచే. అందుకే ప్రతి ఏడాది జనవరి 26 వ తేదీన గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తుంటారు. భారత రాజ్యాగం ఏర్పడి 70 ఏళ్ళు అయ్యింది. ఇప్పటి వరకు అందులో ఎన్నో సవరణలు చేశారు. ఎన్నో మార్పులు చేశారు.
దీంతో పాటు ఈరోజు సుప్రీం కోర్టు మహారాష్ట్ర అసెంబ్లీ విషయంలో కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు చరిత్రాత్మకమనే చెప్పాలి. గవర్నర్ నవంబర్ 30 వరకు బలపరీక్షకు సమయం ఇచ్చినా.. సుప్రీం కోర్టు మాత్రం నవంబర్ 27 సాయంత్రం 5 గంటల లోపుగా బలపరీక్ష జరగాలని తీర్పు ఇచ్చింది. ఈ మూడు సంఘటనలు నవంబర్ 26 వ తేదీన జరిగిన గొప్ప విషయాలుగా చెప్పొచ్చు.
754103 164308Genuinely instructive and fantastic structure of content material , now thats user friendly (:. 941275
614916 746741Hey there! Excellent post! Please when I will see a follow up! 402270
645234 486331There is noticeably a bundle to realize about this. I assume you made various nice points in attributes also. 484020
78539 610731I real glad to uncover this web internet site on bing, just what I was looking for : D likewise saved to bookmarks . 98566