Switch to English

టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ గా వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ, ఆయన రాజీనామా చేయలేదు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో అధికారుల వైఖరికి నిరసనగా ఇద్దరు బోర్డు సభ్యులు రాజీనామా చేసినా, పుట్టా మాత్రం రాజీనామా చేసేది లేదని తెగేసి చెప్పారు. ప్రభుత్వం తమ నియామకాన్ని రద్దు చేసేంత వరకు టీటీడీ చైర్మన్ గానే కొనసాగుతానని స్పష్టంచేశారు.

ఈ అంశంపై గుర్రుగా ఉన్న వైఎస్సార్ సీపీ నేతలు ఈ విషయాన్ని తమ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రస్తుత టీటీడీ బోర్డును రద్దు చేసి, వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వలేదు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు టికెట్ కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైవీ అలిగి కొంతకాలంపాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆయనతో మాట్లాడి, ఎన్నికలయ్యాక మంచి పదవి ఇస్తానని వైవీకి హామీ ఇచ్చారు. దీంతో మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో వైవీ చురుగ్గా పాల్గొన్నారు.

అనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ మెజార్టీతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైవీకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఆయన్ను టీటీడీ చైర్మన్ గా చేయాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా టీటీడీ చైర్మన్ రేసులో పోటీ పడుతున్నారు. తనకు జగన్ కేబినెట్ లో చోటు దక్కకపోతే రెండోసారి టీటీడీ చైర్మన్ చేయాలని కోరుతున్నారు. అయితే, గతంలో ఆయనపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా భూమనకు టీటీడీ చైర్మన్ గిరీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డికే ఆ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో ఇక ఆయన నియామకం లాంఛనమే కానుందని వైఎస్సార్ సీపీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ కోటాలో టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి.. తర్వాత టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూసిన తర్వాత అధినేత జగనే ఆయన్ను అధికార పార్టీలోకి పంపించారనే ప్రచారం కూడా సాగింది. దానికి తగ్గట్టుగానే పొంగులేటి ఫిరాయింపు అంశాన్ని వైఎస్సార్ సీపీ సీరియస్ గా తీసుకోలేదు.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం టికెట్ ను పొంగులేటికి కాకుండా టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు కేటాయించారు. అయినప్పటికీ తన వ్యాపార ప్రయోజనాల కోసం పొంగులేటి పార్టీ మారకుండా టీఆర్ఎస్ లోనే కొనసాగుతూ అధినేత పట్ల విధేయత కనబరిచారు. దీంతో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఆయన పేరును ప్రతిపాదించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...