తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ గా వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ, ఆయన రాజీనామా చేయలేదు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో అధికారుల వైఖరికి నిరసనగా ఇద్దరు బోర్డు సభ్యులు రాజీనామా చేసినా, పుట్టా మాత్రం రాజీనామా చేసేది లేదని తెగేసి చెప్పారు. ప్రభుత్వం తమ నియామకాన్ని రద్దు చేసేంత వరకు టీటీడీ చైర్మన్ గానే కొనసాగుతానని స్పష్టంచేశారు.
ఈ అంశంపై గుర్రుగా ఉన్న వైఎస్సార్ సీపీ నేతలు ఈ విషయాన్ని తమ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రస్తుత టీటీడీ బోర్డును రద్దు చేసి, వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వలేదు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు టికెట్ కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైవీ అలిగి కొంతకాలంపాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆయనతో మాట్లాడి, ఎన్నికలయ్యాక మంచి పదవి ఇస్తానని వైవీకి హామీ ఇచ్చారు. దీంతో మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో వైవీ చురుగ్గా పాల్గొన్నారు.
అనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ మెజార్టీతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైవీకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఆయన్ను టీటీడీ చైర్మన్ గా చేయాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా టీటీడీ చైర్మన్ రేసులో పోటీ పడుతున్నారు. తనకు జగన్ కేబినెట్ లో చోటు దక్కకపోతే రెండోసారి టీటీడీ చైర్మన్ చేయాలని కోరుతున్నారు. అయితే, గతంలో ఆయనపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా భూమనకు టీటీడీ చైర్మన్ గిరీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డికే ఆ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో ఇక ఆయన నియామకం లాంఛనమే కానుందని వైఎస్సార్ సీపీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ కోటాలో టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి.. తర్వాత టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూసిన తర్వాత అధినేత జగనే ఆయన్ను అధికార పార్టీలోకి పంపించారనే ప్రచారం కూడా సాగింది. దానికి తగ్గట్టుగానే పొంగులేటి ఫిరాయింపు అంశాన్ని వైఎస్సార్ సీపీ సీరియస్ గా తీసుకోలేదు.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం టికెట్ ను పొంగులేటికి కాకుండా టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు కేటాయించారు. అయినప్పటికీ తన వ్యాపార ప్రయోజనాల కోసం పొంగులేటి పార్టీ మారకుండా టీఆర్ఎస్ లోనే కొనసాగుతూ అధినేత పట్ల విధేయత కనబరిచారు. దీంతో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఆయన పేరును ప్రతిపాదించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
421350 251832Read More HERE. I bookmarked it. 472736
414014 72664I like this weblog so significantly, saved to my bookmarks . 424540
424875 467076quite good post, i undoubtedly actually like this excellent site, carry on it 658129
905878 771008I agree together with your points , fantastic post. 381337
602185 767023Hey this really is kinda of off subject but I was wanting to know if blogs use WYSIWYG editors or in the event you need to manually code with HTML. Im starting a blog soon but have no coding experience so I wanted to get advice from someone with experience. Any help would be greatly appreciated! 73913
639278 265769I like this post, enjoyed this 1 thanks for posting . 781126