ఏపీ శాసనసభలో తిరుగులేని మెజార్టీ ఉన్న వైఎస్సార్ సీపీ.. శాసనమండలిలోనూ తన పట్టు పెంచుకోవడానికి కసరత్తు చేస్తోంది. మండలిలో బలం లేకపోవడం వల్లే వైసీపీ దానిని రద్దు చేస్తూ కేంద్రానికి తీర్మానం కూడా పంపించిన సంగతి తెలిసిందే. అది పార్లమెంటులో అలాగే పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో మండలిలో పట్టు పెంచుకోవాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఆ సభలో వైసీపీకి 10 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అయితే, వచ్చే జూన్ నాటికి 23 మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు. దీంతో ఆ నాలుగింటితోపాటు మిగిలిన 19 స్థానాలను కైవసం చేసుకుంటే మండలిలో అధికార పార్టీ బలం 29కి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కసరత్తు సాగిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైనవారిలో ఐదుగురు మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఐదు స్థానాలూ వైసీపీకే రానున్నాయి.
అలాగే మేలో మరో ముగ్గురి పదవీకాలం ముగుస్తుంది. అవి కూడా వైపీపీ ఖాతాలోకే పడతాయి. ఇవి కాకుండా గవర్నర్ కోటాలో నియమితులైనవారిలో నలుగురి పదవీకాలంతోపాటు స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైనవారిలో 11 మంది పదవీకాలం కూడా జూన్ తో ముగుస్తుంది. గవర్నర్ కోటా ఎలాగూ అధికార పార్టీ ఖాతాలోకే వెళుతుంది.
ఇక స్థానిక కోటాలో 11 స్థానాలు కూడా కైవసం చేసుకుంటే మండలిలో అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది. దీంతో ఆ దిశగా అధినాయకత్వం పావులు కదుపుతోంది. ఇక మండలి చైర్మన్ షరీఫ్, డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం పదవీకాలం కూడా త్వరలోనే ముగియనుంది. వారి స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై కూడా అధిష్టానం సమాలోచనలు జరుపుతోంది.
612293 222094Maintain up the wonderful work , I read couple of weblog posts on this web site and I believe that your site is real interesting and has bands of good information . 21632