Switch to English

పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ జగన్ మాటల్లో నిగూడార్థమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పునరావాసం కల్పించకుండా పోలవరం ప్రాజెక్టులో నీళ్ళు నింపే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పోలవరం ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల్ని పరామర్శించిన క్రమంలో పునరావాసంపై వచ్చిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి పై విధంగా స్పందించారు.

నిజమే, ప్రాజెక్టు పూర్తవడమంటే.. ప్రాజెక్టు ముంపు ప్రజలకు పూర్తిస్థాయిలో పరిహారం అందించాక, ప్రాజెక్టులో నీళ్ళను నింపడం. నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు.. అన్నట్టు, పోలవరం ప్రాజెక్టు దశాబ్దాలుగా నలుగుతూనే వుందిగానీ, పూర్తవడంలేదు.

ఎప్పుడో బ్రిటిష్ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఆలోచన జరిగితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ’జలయజ్క్ష్ం‘ కింద పోలవరం ప్రాజెక్టు పేరుతో పబ్లిసిటీ స్టంట్ మరింత ముదిరి పాకాన పడింది. జాతీయ ప్రాజెక్టు హోదా వచ్చాక కూడా పోలవరం ప్రాజెక్టు.. గడచిన ఎనిమిదేళ్ళలో పూర్తికాలేకపోయిందంటే, ప్రాజెక్టు చుట్టూ ఎంత రాజకీయం నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు.

సవరించిన అంచనాల ఆమోదం చుట్టూ నానా గందరగోళం నడుస్తోంది. ఈ విషయమై అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్రానికీ స్పష్టత లేదు. మరెలా, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ముంపు పరిహారం బాధ్యత కేంద్రానిదా.? రాష్ట్రానిదా.? ఈ విషయమ్మీదనే స్పష్టత లేకుండా, ’వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టుని పూర్తి చేసేది ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..‘ అంటోంది వైసీపీ.

అంతే కాదు, ప్రాజెక్టు సంగతి తర్వాత, ముందైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పెట్టాలన్నది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గేట్ల నిర్మాణం దాదాపు పూర్తయిపోయింది. కానీ, ప్రాజెక్టులో నీళ్ళు నింపడానికి వీల్లేని పరిస్థితి. కాఫర్ డ్యామ్ విషయమై గందరగోళం, డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో సంబంధిత శాఖ మంత్రికి తెలియని వైనం.

2024 జూన్ లోపు ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదని కేంద్రం తాజాగా వెల్లడించింది. ప్రాజెక్టు పూర్తయినా, నీళ్ళు వెంటనే నింపరనీ, అలా నింపితే డ్యామ్ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అంటే, 2027 వరకూ పోలవరం ప్రాజెక్టు మీద ఆశలు పెట్టుకోవాల్సిన పనిలేదన్నమాట. ఇదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటల్లోని నిగూఢార్థమని అనుకోవాలా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...