పచ్చ మీడియాగా పేరొందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ అధిపతి ప్రతి వారం రాసే ‘పలుకు’ ఎప్పటికప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతుంటుంది. మీడియా వర్గాల్లో అయితే, బోల్డంత చర్చకు కారణమవుతుంటుంది. దాదాపుగా ఈ పలుకు మీద సెటైర్లే పడుతుంటాయి తప్ప, ‘నిజమే కదా.!’ అని ఎవరూ అనే పరిస్థితి వుండదు.
నిజంగానే ఆ ‘చెత్త పలుకు’లో నిజాలున్నా, ఆ పలుకులు చెప్పే వ్యక్తి ‘వ్యక్తిత్వం’ నేపథ్యంలో అవి చెత్త పలుకులుగా మిగిలిపోతున్నాయి. అమరావతిని వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించి వుంటే.. అంటూ దీర్ఘం తీశారు ‘చెత్త పలుకు’లో. అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగి వుంటే, బోల్డంత అభివృద్ధి జరిగిపోయేదట. ఇదీ సదరు ‘చెత్త పలుకు’ ఉవాచ. ఏమో.. నిజమేనేమో.!
కానీ, చంద్రబాబు హయాంలో ఎందుకు అభివృద్ధి చెందలేదట.? 2018 చివరి నాటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాజెక్టుకి సంబంధించి తొలి ఫేజ్ పూర్తి చేసి, తన సత్తా చాటి చెప్తానన్నారు టీడీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఏదీ.? ఎక్కడ.? అమరావతి ఫస్ట్ ఫేజ్ ఏమయ్యింది.? అని ఇప్పుడు వెతుక్కోవాలి అమరావతిలో.
‘కేంద్రం, ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వలేదు’ అని ఓవరాక్షన్ చేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే, అమరావతిని ‘తనంతట తానుగా అభివృద్ధి చెందే ప్రాజెక్టు’ అని పదే పదే చెప్పుకుంటూ వస్తోంది తెలుగుదేశం పార్టీ. టీడీపీ గనుక, ఓ ఫేజ్ని తన హయాంలో పూర్తి చేసి వుంటే.. ఇప్పుడీ దుస్థితి దాపురించేది కాదేమో అమరావతికి.
ఇక, అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ తప్పిదాల్ని ఎలా విస్మరించగలం.? రాజధాని అమరావతిలో ఎలాంటి అభివృద్ధీ లేకుండా ఏడాది కాలం పాటు ‘ఎక్కడి పనులు అక్కడే నిలిపేయడం’ అంటే, రాష్ట్రం మీద అధికార పార్టీకి వున్న ‘బాధ్యత’ ఏంటి.?
టీడీపీ పలికే ‘కమ్మ’టి పలుకులు.. ఆ ‘కమ్మ’టి పలుకుల మీద గుస్సా అయ్యే బులుగు మీడియా.. వెరసి.. పచ్చ రాజకీయాలు.. బులుగు రాజకీయాలు ఓ ఖచ్చితమైన అవగాహనతో రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
రాజధాని అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ‘ఆధిపత్య పోరు’లా తయారవడం, రాష్ట్ర ప్రజలకు శాపం.
275015 601953That is the very first time I frequented your web page and thus far? I surprised with the research you made to make this actual publish amazing. 258166
715933 13001Thank you for some other wonderful article. 494005