హైకోర్టు మొట్టికాయలేసింది.! ఔను, సలహాదారుల విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీకి.. వైసీపీ ప్రభుత్వానికి మొట్టికాయలే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులు ఎందుకు.? ఔను, కదా.. సలహాదారులెందుకు.? కేవలం ప్రజాధనాన్ని దుర్వినయోగం చేయడం కోసమే సలహాదారుల వ్యవస్థ పుట్టింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి దేవస్థానాల పాలక మండళ్ళు.!
మతిలేని వ్యవహారమే ఇది.! లేకపోతే, దేవాలయానికి పాలక మండలి ఏంటి.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? వైసీపీ ప్రభుత్వమనో, చంద్రబాబు ప్రభుత్వమనో కాదు.! ప్రజా ధనాన్ని పందికొక్కుల్లా మేసెయ్యడానికే రాజకీయ నాయకులున్నారన్నది ఇలాంటి సందర్భాల్లోనే గట్టిగా అనిపిస్తుంటుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ హయాంలో కుప్పలు తెప్పలుగా సలహాదారులు పుట్టుకొచ్చారు. కొత్తగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అట.! ఆయనగారి పనేంటి.? అసలు ఈ సలహాదారుల వల్ల ప్రజలకు లాభమేంటి.? ప్రజలకు లాభం లేని సలహాదారుల పోస్టులకి.. ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా ఎలా వెచ్చిస్తారు.?
ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలిస్తారు.. మరి, వాళ్ళతో పని చేయించుకోకుండా.. వాలంటీర్ వ్యవస్థ ఎందుకు.? ‘వాలంటీర్లంటే, మన పార్టీకి చెందినవారే..’ అని వైసీపీ ముఖ్య నాయకుడొకరు గతంలో సెలవిచ్చారు. ‘వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయాలి..’ అని మంత్రులు హుకూం జారీ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి ప్రజాధనం నుంచి వేతనాలు చెల్లిస్తున్న పరిస్థితి.
సలహాదారుల విషయమై హైకోర్టులో విచారణ సందర్భంగా, ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.. తహసీల్దారులకు కూడా సలహాదారులు నియమిస్తారని.! ఏమో, రేప్పొద్దున్న ప్రభుత్వానికి ఆ ఐడియా కూడా వస్తుందేమో.
వాలంటీర్ల కింద.. మళ్ళీ సహ వాలంటీర్లనో.. సలహాదారులనో పెట్టి.. వాళ్ళకీ గౌరవ వేతనాలు ఇచ్చే ‘కార్యక్రమం’ వైసీపీ సర్కారు చేపడుతుందేమో.! ‘వాడిది కాకపోతే తాటిమట్టకి ఎదురు దేకమన్నాడట వెనకటికి ఒకడు’ అన్నది వెనకటికి ఓ ముతక సామెత. అలా వుంది.. ఈ సలహాదారులు, వాలంటీర్ల వ్యవహారం.!
సొమ్ము జనాలది.. సోకు.. ఇదిగో ఈ సలహాదారులు, వాలంటీర్లది.!