Switch to English

జస్ట్ ఆస్కింగ్: బీజేపీ ఎంతమందిని అనర్హుల్ని చేసింది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

టీడీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న నలుగురు ఎంపీల్ని, బీజేపీ లోకి లాక్కున్న భారతీయ జనతా పార్టీ.. మరో అంశానికి సంబంధించి ‘అనర్హత వేటు’ అనే వాదనను తెరపైకి తెచ్చింది. పైగా, ఇది తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో జరుగుతున్న చర్చ కావడం మరింత ఆసక్తికరం. అందునా, క్రైస్తవంలోకి మారిన దళితుల వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవధర్ గత కొద్ది కాలంగా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఆయన తాజాగా మరో ముందడుగు వేసి, ‘అంబేద్కర్ క్రైస్తవ మతంలోకి మారటానికి పూర్తిగా వ్యతిరేకం. రాజ్యాంగం ప్రకారం ఒకసారి ఎస్సీ మతం మారితే, వారికున్న ప్రయోజనలన్నంటినీ కోల్పోతారు. ఎస్సీలకు కేటాయించిన సీట్లలో, క్రిస్టియన్లను పోటీ చేయించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీలకు ద్రోహం చేస్తున్నారు. మేము వారిని చట్ట ప్రకారం అనర్హులను చేస్తాము..’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల్ని బీజేపీ తమ అధికార సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసింది. అంతా బాగానే వుందిగానీ, ’మీ విషయంలో ఏమవుతుంది గురుమూర్తి.?’ అని సునీల్ దేవధర్ ప్రశ్నించడమే మరింత ఆశ్చర్యకరం. వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని టార్గెట్ చేసిన సునీల్ దేవధర్ సంధిస్తున్న ప్రశ్నాస్త్రమిది.

కానీ, గురుమూర్తి ఇప్పటికే తాను హిందువునని ప్రకటించారు, అందుకు తగ్గ ఆధారాలు చూపారు. గురుమూర్తి విషయాన్ని పక్కన పెడితే, ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత విషయంలోనూ బీజేపీ ఇలాంటి ఆరోపణలే గత కొంతకాలంగా చేస్తోంది. ‘చట్టప్రకారం అనర్హులను చేస్తాము’ అని చెబుతున్న బీజేపీ, మేకతోటి సుచరితపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోంది.? అన్నది ఆసక్తికరం ఇక్కడ. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎవరూ ఊహించని రీతిలో మత మార్పిడులు జరిగాయనీ, అవి ఇంకా జరుగుతున్నాయనీ, ప్రస్తుతం రాష్ట్రంలో క్రిస్టియన్ల జనాభా 25 శాతం దాటేసి, 50 శాతం దిశగా పరుగులు పెడుతోందనీ ఆరోపించారు.

మరి, ఈ అంశాలపై బీజేపీ స్టాండ్ ఏమిటి.? తిరుపతి ఉప ఎన్నిక వేళ ఈ అంశాలపై బీజేపీ స్పష్టత ఇవ్వాలి. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, మతం మార్చుకున్న వ్యక్తులకు వారికి తమ మాజీ మతాల ద్వారా అందే రిజర్వేషన్ల ఫలాలు అందనీయకుండా చేయడంలో ఎంత చిత్తశుద్ధిని ప్రదర్శించింది.? ప్రదర్శించబోతోంది.? ఏమో, కమలనాథులకే తెలియాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...