Switch to English

రెడ్డిగారూ.. ఈ ‘మిడతల’ దండు మాటేమిటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియాలో ‘పంచ్‌లు’ బాగానే పేలుస్తారుగానీ, వాటిల్లో చాలావరకు ‘మిస్‌ఫైర్‌’ అవుతుంటాయి. అనుకోకుండా మిస్‌ఫైర్‌ అవుతాయా.? లేదంటే, మిస్‌ఫైర్‌ అవ్వాలనే ఆయన అలాంటి ట్వీట్లేస్తారో వైసీపీ శ్రేణులకే అర్థం కాని పరిస్థితి. అలా మిస్‌ఫైర్‌ అయ్యే చాలా ‘పంచ్‌లు’ వైఎస్సార్‌సీపీనే ఇరకాటంలో పడేస్తుంటాయి.

తాజాగా విజయసాయిరెడ్డి మరో ‘మిస్‌ఫైర్‌ పంచ్‌’ వేశారు. ఇది సూటిగా వైసీపీకే తగిలేసింది. అసలు విషయమేంటంటే, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళుతున్న నేతల్ని ‘మిడతలు’గా అభివర్ణించారు విజయసాయిరెడ్డి తన తాజా ట్వీట్‌లో. ‘ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నకనకలాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే కొన్ని మిడతలు ఆ పార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే, మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి..’ అంటూ ట్వీటేశారు విజయసాయిరెడ్డి.

ట్వీట్‌ అదిరింది కదూ.! ఎప్పుడూ పక్క పార్టీల మీద ప్రేమేనా.? సొంత పార్టీని కూడా కాస్త పట్టించుకోవాలి కదా విజయసాయిరెడ్డిగారూ.. అంటూ కొందరు వైసీపీ మద్దతుదారులు సెటైర్లు వేస్తుండడం గమనార్హం. అవును మరి, కొన్ని మిడతలు (విజయసాయిరెడ్డి భాషలోనే చెప్పాలంటే..) ఇప్పటికే వైసీపీలో చేరాయి. పైగా, ఆ మిడతలకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అధిక ప్రాధాన్యతనిస్తోందట వైసీపీ అధిష్టానం.

ఇలా వైసీపీలోకి వెళ్ళిన ఓ మిడత గతంలో వైసీపీ గురించి ఏం చెప్పిందో తెలుసా.? ‘కడుపుకి అన్నం తినేవాడెవడూ వైసీపీలోకి వెళ్ళడు..’ అని. అలాంటి మిడతనే వైసీపీ అక్కున చేర్చుకున్న దరిమిలా, వైసీపీకి ‘మిడతల ముప్పు’ వుందని విజయసాయిరెడ్డి ముందస్తుగా అంచనా వేయకపోవడాన్ని ఏమనుకోవాలి.? చూస్తోంటే ‘ఫ్యాను’ మీద కంటే ‘కమలం’ మీద రోజురోజుకీ మమకారం ఎక్కువైపోతున్నటుంది.!

‘ఏం విజయసాయిరెడ్డిగారూ, మీరు కూడా మిడతలా మారి, కమలం పార్టీ వైపు వెళ్ళబోతున్నారా.?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నేదో కొంత ఇంట్రెస్టింగ్‌గా వుంది కదూ.! ఎవరి మీదనో సెటైర్లు వేయాలని తమ పార్టీని పదే పదే ఇరకాటంలో పడేసే విజయసాయిరెడ్డి ఈసారి ట్వీట్‌తో తనను తానే ఇరకాటంలో పడేసుకోవడం ఆశ్చర్యకరమే మరి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...