ప్రజాస్వామ్యంలో తిరుగులేని పాశుపతాస్త్రం.. ఓటు. వజ్రాయుధాన్ని మించిన శక్తివంతమైన ఈ ఆయుధమే మన తలరాతను నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఓటును వినియోగించుకునే విషయంలో తెలుగు ప్రజల్లో చైతన్యం ఎక్కువే. అందుకే గురువారం జరిగే ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓట్లేసేందుకు జనం సొంతూళ్లకు పోటెత్తారు. రైళ్లు, బస్సుల్లో టికెట్లు లేకపోయినా, స్పెషల్ బస్సులు కూడా ఫుల్ అయినా, ఎలాగైనా ఊరెళ్లి ఓటేసి రావాల్సిందేనని గట్టిగా తీర్మానించుకున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు దాదాపు 12 లక్షల మంది తరలి వెళ్లినట్టు అంచనా. ఇక మంగళ, బుధవారాల్లో మరో ఏడెనిమిది లక్షల మంది సొంతూళ్లకు పయనం కానున్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు వేసినా, తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు స్పెషల్ బస్సులు నడుపుతున్నా.. రద్దీ మాత్రం తీవ్రంగా కొనసాగుతోంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్ అయితే ఈ రద్దీని సొమ్ము చేసుకుంటున్నాయి. చార్జీలను అమాంతం పెంచేసి, సగటు ఓటరుని దోచుకుంటున్నాయి.
సాధారణ సమయాల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు నాన్ ఏసీ బస్సు చార్జీ 350 ఉండగా.. ప్రస్తుతం అది 700కి పైగా పెంచేశారు. ఇక అమలాపురం, రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు అయితే రూ.2వేల నుంచి 2,500 మధ్య టికెట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇవి కాకుండా ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు సొంతంగా రవాణా వసతి ఏర్పాటు చేశారు. నేతలు ఏర్పాటు చేసిన బస్సుల్లో వెళ్లేవారి కంటే సొంతంగా చార్జీలు పెట్టుకుని వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది.
వాస్తవానికి ఏపీలో ఓటు హక్కు ఉండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నవారి సంఖ్య దాదాపు 25 లక్షలకు పైనే ఉంటుందని అంచనా. వీరంతా ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, ఓటు హక్కు మాత్రం సొంత ఊళ్లోనే ఉంచుకున్నారు. అక్కడ ఎవరిని గద్దెనెక్కించాలో నిర్ణయించేది వీరే. గత ఎన్నికల సమయంలో రికార్డు స్థాయిలో ఏకంగా దాదాపు 25 లక్షల మంది హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి ఓటేసి వచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఆ ఎన్నికల్లో అనుభవశాలి అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు పట్టం కట్టాలనే ఉద్దేశంతో.. యువత గట్టిగా నిర్ణయం తీసుకుని తమ తమ ప్రాంతాలకు పయనమయ్యారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో స్వచ్ఛందంగా అప్పుడు తరలి వెళ్లారు. అదే ఒరవడి ప్రస్తుతం కూడా కొనసాగుతోంది.
వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టుకుని ఏం వెళతాంలే అని అనుకోకుండా ఓటు అనే పాశుపతాస్త్రాన్ని సంధించడానికి జన్మభూమికి వెళుతున్నారు. ఏపీలో ఎవరికి పట్టం కట్టాలో డిసైడ్ చేసేది మేమే అంటూ కదం తొక్కి దూసుకెళ్తున్నారు. ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలు హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ప్రతి ఓటూ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఉప్పెనలా తరలి వెళుతున్న ఏపీ వాసులు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.
697823 239003Rattling clean web site , appreciate it for this post. 861488
618480 986010Aw, this was a really nice post. In thought I wish to put in writing like this moreover – taking time and precise effort to make an superb article but what can I say I procrastinate alot and under no circumstances appear to get something done. 34140
25543 442305How do I know if a Wordpress theme supports a subscribe option? 320485