వాలంటీర్ వ్యవస్థ మీద వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ప్రశంసలు గుప్పిస్తోన్న విషయం విదితమే. వాస్తవానికి గ్రౌండ్ లెవల్లో కొందరు వాలంటీర్లు అత్యద్భుతంగా పనిచేస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం.. మొత్తంగా వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటం, దొంగతనాలు చేయడం వంటి చర్యలతో ఎప్పటికప్పుడు వాలంటీర్లు వార్తల్లోకెక్కుతున్నారు.
ఇదిలా వుంటే, తాజాగా గుంటూరు జిల్లాలో ఓ వాలంటీర్ ఏకంగా సచివాలయ ఉద్యోగిపై దాడి చేశాడు. రేషన్ కార్డు దరఖాస్తులు పరిశీలించాలంటూ గుంటూరు జిల్లా అమరావతి మండలం యండ్రాయి సచివాలయంలో సచివాలయ ఉద్యోగి డిజిటల్ అసిస్టెంట్ బాబూరావుపై ఒత్తిడి తెచ్చిన వాలంటీర్ వినోద్, తన పని వెంటనే పూర్తి కాకపోవడపై అసహనం వ్యక్తం చేస్తూ పంచాయితీ సెక్రెటరీ యెదుటే దాడికి పాల్పడటం గమనార్హం.
‘వాలంటీర్లలో మా పార్టీ కార్యకర్తలకే ఎక్కువగా ఉద్యోగాలిచ్చుకున్నాం..’ అని గతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకున్నారు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఉద్యోగుల్ని తమ విధులు కూడా నిర్వహించనంతగా వాలంటీర్ల రూపంలో వున్న అధఙకార పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనుకోవాలా.?
👉గుంటూరు జిల్లా అమరావతి మండలం యండ్రాయి సచివాలయంలో,సచివాలయ ఉద్యోగి పై వాలంటీర్ దాడి
👉సచివాలయం లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ బాబూరావు పై దాడి చేసిన వాలంటీర్ వినోద్
👉నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావంటూ పంచాయతీ సెక్రటరీ ఎదుట దాడిచేసిన వినోద్#TDP #YSRCP @gkd600 #Janasena pic.twitter.com/xyEr2jWFzG
— TeluguBulletin.com (@TeluguBulletin) October 20, 2020
211237 261613Immer etliche Firmen bentzen heutzutage Interimmanagement als innovatives und ergnzendes Gertschaft i. Spanne der Unternehmensfhrung. Denn hiermit wird Kenntnisstand leistungsfhig, bedarfsgerecht und schnell ins Unternehmen geholt. 722912