ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాములమ్మ అలియాస్ విజయశాంతి, గత కొంతకాలంగా రాజకీయాలకు కాస్త దూరంగా వున్నారు. తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ద్వారా కాదు.. సొంత గూటికి చేరేందుకు వడివడిగా అడుగులేస్తున్నారు విజయశాంతి.
విజయశాంతి రాజకీయ ప్రయాణం బీజేపీతో ప్రారంభమైన విషయం విదితమే. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన ఎల్కే అద్వానీ శిష్యురాలిగా పేరొందారు అప్పట్లో విజయశాంతి. ఓ దశలో ఆమెకు కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ కూడా వచ్చింది. అయితే, స్వతహాగా వున్న ‘ఆటిట్యూడ్’ కారణంగా రాజకీయాల్లో ఆమె చాలా కోల్పోయారు.
తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు.. దాన్ని, టీఆర్ఎస్లో కలిపేశారు. టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారుగానీ, ఆ పార్టీలోనూ ఎక్కువ కాలం వుండలేకపోయారు. టీఆర్ఎస్లోనే వుండి వుంటే, ఆమెకు కీలకమైన పదవులు ఎన్నో దక్కేవే. కాంగ్రెస్లోకి వచ్చాక టీఆర్ఎస్ మీద విరుచుకుపడి ఆమె సాధించిందేమీ లేదు. ఇక, ఇప్పుడు ఆమె సొంత గూటికి చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కాస్సేపటి క్రితం బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో విజయశాంతి భేటీ అయ్యారు. బీజేపీలో ఆమె చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కిషన్రెడ్డితో భేటీ అవడమంటే, బీజేపీలో చేరేందుకు ఆమె ముహార్తం ఖరారు చేసుకున్నట్లే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతుండడంతో, విజయశాంతి బీజేపీ వైపు చూస్తున్నారన్నది సుస్పష్టమవుతోంది.
అయితే, సొంత గూటికి చేరాక, విజయశాంతి.. బీజేపీ నేతగా తిరిగి చక్రం తిప్పగలుగుతారా.? మళ్ళీ రాజకీయాల్లో ‘జూనియర్’ అనే స్థాయి నుంచే ఆమె రాజకీయ ప్రయాణం మొదలవుతుందా.? ఏమోగానీ.. దుబ్బాక ఉప ఎన్నిక వేడి తారాస్థాయికి చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతి బీజేపీ వైపుకు అడుగులేస్తుండడం కాంగ్రెస్ పార్టీకే కాదు, టీఆర్ఎస్కి కూడా షాక్ అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
773418 563501Cheers for this outstanding. I was wondering should you were thining of writing comparable posts to this one. .Keep up the wonderful articles! 554480
392534 245957Hello! I just wish to give an enormous thumbs up for the great information you may have correct here on this post. I can be coming once more to your blog for much more soon. 507450