Hanu-man: హను-మాన్ (Hanu-man) సినిమాకు ధియేటర్ల కేటాయింపుపై కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈక్రమంలో నైజాంలో పలు ధియేటర్లు తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి నష్టం కలిగిస్తున్నాయని చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీస్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈనేపథ్యంలో చిత్ర నిర్మాతల మండలిని ఆశ్రయించారు. దీంతో ఆయా ధియేటర్ల చర్యపై చిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్ పీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘ఇటువంటి చర్యలు సినీ పరిశ్రమ మనుగడకు నష్టం. జనవరి 12 నుంచి హను-మాన్ ప్రదర్శనకు ముందుగా మైత్రీ మూవీస్ తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లింది. ముందస్తు ఒప్పందాన్ని కొనసాగించి సినిమా ప్రదర్శించాలని కోరుతున్నాం. ఇప్పటివరకూ జరిగిన నష్టాన్ని కూడా భరించాల’ని ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో వచ్చిన హను-మాన్ జనవరి 12న విడుదలై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.