ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీకి ఆనందం కలిగించే సర్వే ఒకటి వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన దాదాపు అన్ని సర్వేల్లోనూ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని తేలగా.. తాజాగా వచ్చిన న్యూస్ ఎక్స్ పోల్ స్ట్రాట్ సర్వే మాత్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చింది.
దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఈ సర్వే ప్రకారం టీడీపీకి ఈసారి 92 అసెంబ్లీ సీట్లు వస్తాయని వెల్లడైంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ పొందిన సీట్ల కంటే 10 తగ్గుతాయని పేర్కొంది. 2014 ఎన్నికల్లో టీడీపీ 102 సీట్లు గెలుచుకోగా.. ఈసారి 92 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతుందని, ఆ పార్టీ 77 సీట్లతో రెండో స్థానంలో నిలుస్తుందని వివరించింది.
గత ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్ సీపీ సీట్లు మరో 10 పెరుగుతాయని పేర్కొంది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ కు ఈ సారి కాస్త ఆశాజనక ఫలితాలు రావొచ్చని సర్వే అభిప్రాయపడింది. గత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా దాదాపుగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన హస్తం పార్టీకి ఈ ఎన్నికల్లో 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఇక ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి మొండిచేయి చూపిన భారతీయ జనతాపార్టీ ఒక్క సీటు గెలుచుకుంటుందని వెల్లడైంది.
ఏపీలో కింగ్ కాకపోయినా కనీసం కింగ్ మేకర్ అవుతామని ఆశపడుతున్న జనసేన పేరు ఈ సర్వేలో అస్సలు ప్రస్తావనకే రాకపోవడం గమనార్హం. ఇతరులు ఒక సీటు గెలిచే అవకాశం ఉందని మాత్రమే సర్వే ఫలితాల్లో పేర్కొన్నారు. మరి ఆ సీటు జనసేనకా లేక ఇండిపెండెంట్ కా అన్నది కచ్చితంగా తెలియదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. టీడీపీ ఓట్ షేర్ 37 శాతం కాగా, వైఎస్సార్ సీపీ 35 శాతం ఓట్లు తెచ్చుకుంటుందని సర్వేలో వెల్లడైంది.
అంటే రెండు పార్టీల మధ్య 2 శాతం మాత్రమే తేడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ 13 శాతం ఓట్లు తెచ్చుకుంటుందని, బీజేపీకి 9 శాతం ఓట్లు పోలవుతాయని వివరించింది. ఎంపీ సీట్ల విషయంలోనూ టీడీపీకి మొగ్గు ఉన్నట్టు సర్వేలో తేలింది. ఆ పార్టీకి 40 శాతం ఓట్లతో 16 సీట్లు వస్తాయని పేర్కొంది. 37 శాతం ఓట్లతో వైఎస్సార్ సీపీ 9 సీట్లు గెలుచుకుంటుందని వివరించింది. ఎంపీ సీట్ల విషయానికి వచ్చేసరికి టీడీపీ, వైఎస్సార్ సీపీలకు ఓట్లు పెరగ్గా.. కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం తగ్గాయి.
కాంగ్రెస్ కు 6 శాతం, బీజేపీకి 3 శాతం ఓట్ షేర్ ఉంటుందని, సీట్లు ఏవీ రావని సర్వే పేర్కొంది. ఇక సీఎంగా చంద్రబాబే తమ ప్రాధాన్యమని 46 శాతం మంది పేర్కొనగా.. జగన్ సీఎం కావాలని 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. తమకు అనుకూలంగా వచ్చిన ఈ సర్వేతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తంచేస్తుండగా.. వైఎస్సార్ సీపీ నేతలు మాత్రం ఈ సర్వే శాస్త్రీయతపై సందేహాలు లేవనెత్తుతున్నారు. ఈ సర్వే ఎప్పుడు నిర్వహించారు? సర్వే శాంపిల్ సైజ్ ఎంత అని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇటీవల వచ్చిన సీపీఎస్ సర్వేలో వైఎస్సార్ సీపీ 121 నుంచి 130 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.
561671 379372Some really fantastic information , Gladiola I identified this. 65334