Switch to English

ఏపీ టీడీపీదే అంటున్న న్యూస్ ఎక్స్ సర్వే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీకి ఆనందం కలిగించే సర్వే ఒకటి వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన దాదాపు అన్ని సర్వేల్లోనూ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని తేలగా.. తాజాగా వచ్చిన న్యూస్ ఎక్స్ పోల్ స్ట్రాట్ సర్వే మాత్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చింది.

దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఈ సర్వే ప్రకారం టీడీపీకి ఈసారి 92 అసెంబ్లీ సీట్లు వస్తాయని వెల్లడైంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ పొందిన సీట్ల కంటే 10 తగ్గుతాయని పేర్కొంది. 2014 ఎన్నికల్లో టీడీపీ 102 సీట్లు గెలుచుకోగా.. ఈసారి 92 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతుందని, ఆ పార్టీ 77 సీట్లతో రెండో స్థానంలో నిలుస్తుందని వివరించింది.

గత ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్ సీపీ సీట్లు మరో 10 పెరుగుతాయని పేర్కొంది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ కు ఈ సారి కాస్త ఆశాజనక ఫలితాలు రావొచ్చని సర్వే అభిప్రాయపడింది. గత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా దాదాపుగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన హస్తం పార్టీకి ఈ ఎన్నికల్లో 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఇక ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి మొండిచేయి చూపిన భారతీయ జనతాపార్టీ ఒక్క సీటు గెలుచుకుంటుందని వెల్లడైంది.

ఏపీలో కింగ్ కాకపోయినా కనీసం కింగ్ మేకర్ అవుతామని ఆశపడుతున్న జనసేన పేరు ఈ సర్వేలో అస్సలు ప్రస్తావనకే రాకపోవడం గమనార్హం. ఇతరులు ఒక సీటు గెలిచే అవకాశం ఉందని మాత్రమే సర్వే ఫలితాల్లో పేర్కొన్నారు. మరి ఆ సీటు జనసేనకా లేక ఇండిపెండెంట్ కా అన్నది కచ్చితంగా తెలియదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. టీడీపీ ఓట్ షేర్ 37 శాతం కాగా, వైఎస్సార్ సీపీ 35 శాతం ఓట్లు తెచ్చుకుంటుందని సర్వేలో వెల్లడైంది.

అంటే రెండు పార్టీల మధ్య 2 శాతం మాత్రమే తేడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ 13 శాతం ఓట్లు తెచ్చుకుంటుందని, బీజేపీకి 9 శాతం ఓట్లు పోలవుతాయని వివరించింది. ఎంపీ సీట్ల విషయంలోనూ టీడీపీకి మొగ్గు ఉన్నట్టు సర్వేలో తేలింది. ఆ పార్టీకి 40 శాతం ఓట్లతో 16 సీట్లు వస్తాయని పేర్కొంది. 37 శాతం ఓట్లతో వైఎస్సార్ సీపీ 9 సీట్లు గెలుచుకుంటుందని వివరించింది. ఎంపీ సీట్ల విషయానికి వచ్చేసరికి టీడీపీ, వైఎస్సార్ సీపీలకు ఓట్లు పెరగ్గా.. కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం తగ్గాయి.

కాంగ్రెస్ కు 6 శాతం, బీజేపీకి 3 శాతం ఓట్ షేర్ ఉంటుందని, సీట్లు ఏవీ రావని సర్వే పేర్కొంది. ఇక సీఎంగా చంద్రబాబే తమ ప్రాధాన్యమని 46 శాతం మంది పేర్కొనగా.. జగన్ సీఎం కావాలని 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. తమకు అనుకూలంగా వచ్చిన ఈ సర్వేతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తంచేస్తుండగా.. వైఎస్సార్ సీపీ నేతలు మాత్రం ఈ సర్వే శాస్త్రీయతపై సందేహాలు లేవనెత్తుతున్నారు. ఈ సర్వే ఎప్పుడు నిర్వహించారు? సర్వే శాంపిల్ సైజ్ ఎంత అని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇటీవల వచ్చిన సీపీఎస్ సర్వేలో వైఎస్సార్ సీపీ 121 నుంచి 130 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...