Switch to English

జగన్‌ సర్కార్‌పై రాష్ట్రపతికి టీడీపీ ఫిర్యాదు.. నెక్స్‌ట్‌ ఏంటీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

చంద్రబాబు హయాంలో అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అదేనండీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ.. రాష్ట్రపతికి పలు మార్లు పలు విషయాలపై ఫిర్యాదు చేసింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివన్నీ మామూలే. అప్పుడు వైసీపీ చేసిన పనే, ఇప్పుడు టీడీపీ చేసింది. అయితే, ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ఇటు మీడియాని.. అటు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్నీ అవహేళన చేస్తోందన్న విమర్శలు రోజురోజుకీ పెరిగిపోతున్న దరిమిలా, రాష్ట్రపతికి టీడీపీ చేసిన ఫిర్యాదు ఒకింత కలకలం రేపుతున్న మాట వాస్తవం.

‘హత్యా రాజకీయాలు నడుస్తున్నాయి.. విపక్షాలపై కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయి.. మీడియాపైనా దాడులు జరుగుతున్నాయి.. రాజ్యాంగ వ్యవస్థల్నీ వదిలిపెట్టడంలేదు..’ ఇలా పలు అంశాల్ని రాష్ట్రపతికి నివేదించింది టీడీపీ నేతల బృందం. అసలు రాష్ట్రంలో ‘శాంతి భద్రతలు’ అనేవే లేవన్నది టీడీపీ ఆరోపణ.

ఇదిలా వుంటే, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌, సోషల్‌ మీడియా వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం రాష్ట్రపతికి వుందా..’ అని ప్రశ్నిస్తోంటే, దానికి సమాధానమిస్తూ.. దానికి ఓ పద్ధతి వుంటుందనీ, పరిస్థితులపై రాష్ట్రపతికి రాజకీయ పక్షాలు ఫిర్యాదు చేయాల్సి వుంటుందని అన్నారు. అందుకు తగ్గట్టే టీడీపీ, ఇప్పుడు రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. అలాగని, రాష్ట్రపతి రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తారని అనలేం.

కానీ, ఇటీవల బీజేపీ నేత ఒకరిపై రాష్ట్రంలో హత్యాయత్నం జరిగింది. ఆ దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలు కావడం గమనార్హం. అదృష్టవశాత్తూ సదరు బీజేపీ నేత ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుంది. బీజేపీ అధిష్టానం కూడా రాష్ట్రంలో పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ‘కేంద్రంలో అధికారంలో వున్నది మేమేనన్న విషయాన్ని మర్చిపోవద్దు..’ అని ఏపీ బీజేపీ నేతలు, రాష్ట్రంలోని అధికార వైసీపీకి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.

ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఏకంగా హైకోర్టు మీదనే వైసీపీ మద్దతుదారులు, వైసీపీ నేతలు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాల్ని చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోక తప్పేలా లేదేమో.! ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు చంద్రబాబుకి అన్ని విషయాలూ తెలుస్తుంటాయి. అలా ఏదో ‘ఉప్పందబట్టే’ టీడీపీ బృందాన్ని రాష్ట్రపతి వద్దకు పంపిన టీడీపీ అధినేత చంద్రబాబు, రాజకీయంగా తనదైన స్టయిల్లో కీలకమైన ‘ట్విస్ట్‌’ ఇచ్చారా.? అసలేం జరుగుతోంది ఢిల్లీలో.! కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ‘కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి..’ అని కొన్నాళ్ళుగా బీజేపీ నేతలు చెబుతున్న విషయాల్లో వాస్తవమెంత.? వేచి చూడాల్సిందే.

జగన్‌ సర్కార్‌పై రాష్ట్రపతికి టీడీపీ ఫిర్యాదు.. నెక్స్‌ట్‌ ఏంటీ.! జగన్‌ సర్కార్‌పై రాష్ట్రపతికి టీడీపీ ఫిర్యాదు.. నెక్స్‌ట్‌ ఏంటీ.! జగన్‌ సర్కార్‌పై రాష్ట్రపతికి టీడీపీ ఫిర్యాదు.. నెక్స్‌ట్‌ ఏంటీ.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...