Switch to English

అమరావతిపై వ్యూహాత్మకంగానే జగన్ మౌనం!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు రావొచ్చంటూ ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగిల్చింది. ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులు ఈ విషయంలో ఆనందోత్సాహాలతో ఉండగా.. అమరావతి ప్రాంతంలో మాత్రం ఆందోళనలు సాగుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో జరుగుతున్న ఈ నిరసనలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి.

తొలుత చిన్నగా ప్రారంభమైన ఈ ఆందోళనలకు ఒక వర్గం మీడియాతోపాటు టీడీపీ అండగా నిలవడంతో క్రమంగా ఊపందుకున్నాయి. తాజాగా బీజేపీ, వామపక్ష పార్టీలు కూడా వారికి మద్దతుగా నిలిచాయి. టీవీల్లో చర్చలు కూడా విపరీతంగా సాగుతున్నాయి. అయితే, ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఈ విషయంలో ఎక్కడా స్పందించడంలేదు.

రాజధానుల వ్యవహారంలో ఒకరిద్దరు మంత్రులు మాత్రమే మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. మూడు రాజధానులు రావొచ్చంటూ అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత జగన్ ఏ కార్యక్రమంలోనూ దాని గురించి ప్రస్తావించలేదు. ఇదంతా జగన్ వ్యూహాత్మక ఎత్తుగడ అని అంటున్నారు. గతంలో పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలనే నిర్ణయంపైనా బోలెడు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటివారు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వారంతా విమర్శలు చేసిన తర్వాత జగన్ ఒకసారి మీడియా ముందుకొచ్చి అందరినీ ఏకి పారేశారు. ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న మీ పిల్లలు, మనవలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలంటూ నిలదీశారు. మీ పిల్లలకు మాత్రమే ఇంగ్లిష్ మీడియం కావాలి.. పేదల పిల్లలకు వద్దా అని ప్రశ్నించారు. దీనిపై ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తడంతో వారంతా ఇరుకునపడ్డారు.

తాజాగా అమరావతి ఆందోళనల విషయంలో కూడా జగన్ కావాలనే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని తెలుస్తోంది. అమరావతికి మద్దతుగా నిలుస్తూ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న వారంతా ఆయా ప్రాంతాలలో వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. ఇది ఒక విధంగా జగన్ కే లాభం చేకూర్చే పరిణామం. పైగా రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అనవసరంగా ఆవేశపడి విపక్షాలను విమర్శించడం సరికాదనే భావనతోనే జగన్ దీనిపై స్పందించడంలేదు. మొత్తానికి ఈ వ్యవహారంపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...