కరోనా వైరస్ లాక్డౌన్ నుంచి ‘అన్ లాక్’ ఇప్పటికే మొదలైపోయింది. ఒక్కో తాళం తీసేస్తున్నారు. తాజాగా, ఇంకో తాళం తీసేశారు. అదే, మెట్రో రైళ్ళ పునఃప్రారంభం. ఆ తర్వాతి సంగతి విద్యా సంస్థలన్నమాట. కేంద్రం ఇటీవల ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయగా, రాష్ట్రాలు అందుకు తగ్గట్టుగా మార్గదర్శకాల్ని ఖరారు చేసి.. వెసులుబాట్లు కల్పిస్తున్నట్లు అధికారిక ప్రకటనలు చేసేస్తున్నాయి. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు ఈ నెలాఖరు నుంచి స్కూళ్ళకు వెళ్ళొచ్చునట. ఇందుకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి అట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు ఇవి.
దేశంలో కరోనా ప్రస్తుత పరిస్థితి ఏంటో చూస్తే, విద్యార్థుల్ని ఈ ఏడాది స్కూళ్ళకు పంపడం ఏమాత్రం శ్రేయస్కరం కాదనే ఏ తల్లిదండ్రులైనా చెబుతారు. కానీ, ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాక, విద్యా సంస్థలు ఊరుకుంటాయా.? ఇటు పిల్లల్ని, అటు తల్లిదండ్రుల్ని రాచి రంపాన పెట్టేస్తాయి. మొదట్లో.. ‘ప్రాణమే ముఖ్యం..’ అని చెప్పిన ప్రభుత్వాలు, ‘ఆ ప్రాణంతోపాటు.. జీవనం కూడా ముఖ్యం..’ అని సెలవిచ్చాయి. అవును మరి, ప్రభుత్వాలు ‘కుక్కని చూపించి పంది.. అంటే, జనం పంది అనాల్సిందే తప్ప.. అది కుక్క కదా.?’ అని ప్రశ్నించడానికి వీల్లేదేమో.. అన్నట్టు తయారైందిప్పుడు పరిస్థితి.
రోజురోజుకీ కరోనా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది దేశంలో. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశం మనది గత కొద్ది రోజులుగా. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దారుణంగా వుంది. ఈ తరుణంలో స్కూళ్ళను తెరవాలనే ఆలోచన చేయడమేంటి.? ఇతరత్రా ఆర్థిక కలాపాలకు ఆస్కారం కల్పించడం వేరు. విద్యా సంస్థల్ని తెరవడం వేరు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. అయితే, కేంద్రం మార్గదర్శకాలు అమలవడానికి ఇంకా సమయం వుంది గనుక.. ఈలోగా ఆలోచనలు మారుతాయనే ఆశిద్దాం.
464102 911723Thank you for the excellent writeup. It in fact was a amusement account it. Appear advanced to far added agreeable from you! Nonetheless, how could we communicate? 118066
640303 514253I really enjoyed reading this site, this really is excellent weblog. 11674
964367 752094bathroom towels need to be maintained with a great fabric conditioner so that they will last longer:: 434220