Switch to English

సింహాచలము.. మహా వివాదాలమయము..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సింహాచలము.. మహాపుణ్యక్షేత్రము.. అనే పసందైన పాటను ఇప్పుడిలా పాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆలయ చైర్ పర్సన్ గా సంచయిత నియామకం జరిగిన తర్వాత విదాదాస్పద అంశాలతోనే ఈ ఆలయం వార్తల్లోకి వస్తోంది. సంప్రదాయాలకు విరుద్ధంగా మన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా మహిళను నియమించడమే తప్పని అశోక్ గజపతిరాజు తదితరులు వాదిస్తున్నా.. సర్కారు మాత్రం పట్టించుకోలేదు.

ఆమె నియామకమే నిబంధనలకు విరుద్ధమని విపక్షాలు ఆరోపిస్తుండగా.. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓ మహిళ.. స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం మరింత వివాదాస్పదమైంది. ఇదంతా సంప్రదాయాలకు విరుద్ధమని చెబుతున్నా.. సంచయిత అస్సలు పట్టించుకోవడంలేదు. పైగా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి.

ఇప్పటివరకు సంప్రదాయాల విషయంలో వివాదాలు రాగా.. తాజాగా ఆలయ నిర్వహణ విషయంలోనూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆలయాన్ని ఓ ప్రైవేటు వ్యక్తికి అప్పగించేశారని విమర్శలు వస్తున్నాయి. సంచయిత ఎలాంటి పదవీ లేని ఓ వ్యక్తిని తీసుకొచ్చి సింహాచలం కొండ మీద పెట్టారని.. ఆలయ వ్యవహారాలు మొత్తం సదరు వ్యక్తే చూస్తున్నాడని చెబుతున్నారు.

కార్తీక్ సుందర రాజన్ అనే వ్యక్తి సంచయిత వ్యక్తిగత కార్యదర్శిగా దేవస్థానానికి చెందిన ఏసీ కాటేజీలో గత మూడు నెలల నుంచి తిష్ట వేసుకుని కూర్చున్నాడని.. ఆలయానికి సంబంధించిన రికార్డులన్నీ చూస్తున్నాడని చెబుతున్నారు. ఆలయ వాహనంతోపాటు సిబ్బందిని సైతం అతడి సేవల కోసం వినియోగిస్తున్నారని.. సంచయిత ఆదేశాలతో ఇవన్నీ జరుగుతున్నాయని సమాచారం.

ప్రభుత్వానికి సంబంధించని వ్యక్తికి ఇలా ఆలయ సొమ్ముతో రాచమర్యాదలు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంచయిత బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్నీ వివాదాలే అవుతున్నాయి. మన్సాస్ ట్రస్టుకు ఉన్న వేల ఎకరాల భూములను కాజేయడానికే ఆమెకు పగ్గాలు అప్పగించారని ఇప్పటికే విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

ప్రస్తుతం కొండ మీద ఓ ప్రైవేటు వ్యక్తిని కూర్చోబెట్టి ఆలయ రికార్డులన్నీ పరిశీలింపజేయడం ఇందులో భాగమేనని ఆరోపిస్తున్నాయి. ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలన్నీ చూసి ఈవోగా ఉన్న బ్రమరాంబ సర్కారుకు లేఖ రాసి బదిలీ చేయించుకున్నారు.

మరోవైపు అశోక్ గజపతిరాజును మన్సాస్ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి తొలగించడం నిబంధనలకు విరుద్ధమని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి మచ్చా లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది అశోక్ గజపతి రాజేనని.. అలాంటి వ్యక్తిని అలా పదవి నుంచి తొలగించడం సమంజసం కాదన్నారు. ఆడ, మగ సమానమే అయినా.. ఇది మాత్రం సంప్రదాయాలకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. మరి ఈ వివాదాలకు ప్రభుత్వం చెక్ పెడుతుందా అన్నది చూడాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...