పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా దగ్గుబాటి కలిసి సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ సంభాషణలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో సముద్రఖని నటించబోతున్నాడని అధికారికంగా వెల్లడైంది. స్వయంగా సముద్రఖని ఈ విషయాన్ని రివీల్ చేసాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు, తాను ఓకే అన్నట్లు తెలియజేసాడు. అంతే కాకుండా నితిన్, నాని సినిమాల్లో కూడా తాను కీలక పాత్రలు పోషిస్తున్నాను అని తెలిపాడు. ఆర్ ఆర్ ఆర్ లో కూడా కనిపించబోతున్న విషయాన్ని వెల్లడించాడు సముద్రఖని.
89403 392769I real glad to find this internet site on bing, just what I was looking for : D likewise saved to bookmarks . 255935