తొమ్మిది నెలలుగా భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటివల కేసులు తగ్గుముఖం పట్టినా తీవ్రత తగ్గలేదు. ఇప్పుడు మళ్లీ కరోనా విజృంభించబోతోందనీ.. సెకండ్ వేవ్ ఉంటుదని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో రోజురోజుకీ కేసులు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోకుండా ఎవరైనా కనిపిస్తే వారికి రూ.2000 జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈమేరకు జరిగిన క్యాబినెట్ మీటింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ ఉన్న రూ.500 జరిమానాను నాలుగు రెట్లు పెంచినట్టైంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. ‘ప్రస్తుతం కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్త అవసరం. అందరూ విధిగా మాస్కు పెట్టుకోవడం అవసరం. దీనిని అతిక్రమించిన వారికి రూ.2000 జరిమానా విధిస్తాం. పరిస్థితి దృష్ట్యా ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్స్ సమకూర్చిన కేంద్రానికి కృతజ్ఞతలు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఇందులో రాజకీయ పార్టీలు, స్వచ్ఛంధ సంస్థలు పాల్గొనాలి. ప్రస్తుతం రాజకీయాలు పక్కనబెట్టి ప్రజలకు సాయం చేయాలి’.
‘ఢిల్లీ ప్రజలు ఛత్ పూజను బాగా జరుపుకోండి. నది వద్దకు ఎక్కువ మంది వెళ్లడం సరికాదు. కరోనా ఒక్కరికి ఉన్నా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే.. అందరూ ఇళ్లలోనే పండగ జరుపుకోవడం ఉత్తమం. ప్రజలు సహకరించాలి’ అని అన్నారు. ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7486. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
416171 862444I think your suggestion would be beneficial for me. I will let you know if its function for me too. Thank you for sharing this beautiful articles. thanks a whole lot 846718
428203 134713I besides believe therefore , perfectly composed post! . 50175