సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతున్న సంగతి తెల్సిందే. ఎన్ని మలుపులు తిరుగుతున్నా ఈ కేసు విషయమై ఎటువంటి క్లారిటీ రావట్లేదు. రీసెంట్ గా సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెల్సిందే. ఆమెపై మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది. దీంతో ఈడీ అధికారులు రియాను కొన్ని గంటల పాటు ప్రశ్నించారు.
సుశాంత్ మరణించిన కొన్ని రోజుల తర్వాత తనతో రిలేషన్ షిప్ ను ఒప్పుకున్న రియా ఏడాది పాటు తాము సహజీవనం చేసిన విషయాన్ని తెలిపింది. ఇక సుశాంత్ సూసైడ్ కు వారం ముందు తన ఇంటి నుండి బయటకు వచ్చినట్లు ఒప్పుకుంది. అలాగే రీసెంట్ గా రియా సుశాంత్ గురించి మరికొన్ని వివరాల్ని తెలిపింది.
సుశాంత్ గత కొంత కాలంగా మానసికంగా ఆరోగ్యంగా లేడని తెలిపింది. ముఖ్యంగా ఇటలీ ట్రిప్ తర్వాత తన ఆరోగ్యం మరింత క్షీణించిందని వివరించింది. “సుశాంత్, నేను అక్టోబర్ 2019లో ఇటలీ వెళ్లాం. అక్కడ హోటల్ రూమ్ లో ఒక పెయింటింగ్ ను చూసాక సుశాంత్ వణకడం నేను గమనించాను. ఆ ట్రిప్ తర్వాత నుండి తన మానసిక ఆరోగ్యం సరిగా లేదు” అని రియా అధికారులకు వివరించింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును ఎవరికి వారు తమ మైలేజ్ కోసం వాడుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పుడు అది ఒక పొలిటికల్ మైలేజ్ గేమ్ లో భాగం.
522883 179868Satisfying posting. It would appear that a great deal of the stages are depending upon the originality aspect. Its a funny thing about life in the event you refuse to accept anything but the top, you quite often get it. by W. Somerset Maugham.. 738622