‘టీఆర్ఎస్ పాలనలో వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గానికి తుప్పు పట్టింది. కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి. నాలుగేళ్లలో అక్కడేం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటికీ ఎందుకు పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుకు టీఆర్ఎస్ కు సంబంధం లేదు. అన్నీ కాంగ్రెస్ పాలనలో నిర్మించినవే. నియోజకవర్గానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా ఉపయోగం లేదు. కొడంగల్ అభివృద్ధికి నిధులు ఇచ్చేవరకూ ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. అసెంబ్లీలో నిర్ధిష్టమైన ప్రకటన చేయాలి’.
‘తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం నడుస్తోంది. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత, బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్టు చేయట్లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బ తీసే కుట్రలు జరుగుతున్నాయి. ఇందుకు బీజేపీ-టీఆర్ఎస్ కలిసి కుట్రలకు పాల్పడుతున్నాయి’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
962045 952930An fascinating dialogue is value comment. I feel that its greatest to write extra on this matter, it might not be a taboo topic nonetheless usually people are not enough to speak on such topics. To the next. Cheers 368513
234723 695321Excellent post, Im searching forward to hear a lot more from you!! 187574
676153 841536I saw yet another thing concerning this on one more weblog. Youve clearly spent some time on this. Properly done! 842251