నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం ఎలాంటి ఊరటా ఇవ్వలేదు. మద్యం దుకాణాల వేళలను పొడిగించలేదు. గురువారం కూడా ఎప్పటిలాగే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలని స్పష్టంచేసింది. సాధారణంగా డిసెంబర్ 31న కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లు అర్ధరాత్రి వరకు తెరచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది.
అయితే, ఈసారి కరోనా కారణంగా ఏపీ సర్కారు ఎలాంటి వెసులుబాటూ ఇవ్వలేదు. మరోవైపు తెలంగాణ సర్కారు మాత్రం ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లను ఒంటిగంట వరకు తెరచి ఉంచుకోవడానికి అనుమతించింది. ఆ సమయంలో కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టంచేసింది.
302454 771671Thanks for the write up! Also, just a heads up, your RSS feeds arent working. Could you take a look at that? 440158
183496 562837An fascinating discussion could be worth comment. I think you need to write on this subject, it might certainly be a taboo subject but typically people are not enough to dicuss on such topics. To a higher. Cheers 394540