రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా విషయంలో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. నిజానికి మే లోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా క్వాలీటి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని మరింత టైం తీసుకున్నారు. ఈ సినిమా విషయంలో హీరో విజయ్ మొత్తం బాధ్యతనంత తన భుజాలపై వేసుకున్నాడని, ఈ మద్యే సినిమా షూట్ విషయంలో హీరోకి దర్శకుడికి మద్యే విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఈ సినిమా అటు మైత్రి మూవీస్ నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తుందట.
తాజాగా ఈ సినిమాకు రీ షూట్స్ జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే తీసిన కొన్ని సన్నివేశాలు బాగా లేవని మళ్ళీ నిన్నటినుండి రీ షూట్స్ మొదలు పెట్టారట ? తాజాగా హీరోయిన్ రష్మిక మండన డేట్స్ అయిపోయినా కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఆమె డేట్స్ పొడిగించారట. మొత్తానికి విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ .. ఈ సినిమాకు ఇంకా రీ షూట్స్ ఏమిటి ? అంటూ షాక్ అవుతున్నారు సినీ జనాలు.
ఈ నెల 25 న అయినా ఈ సినిమా విడుదల అవుతుందా కదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి క్రేజ్ దక్కడంతో ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయట . ఇప్పటికే ఆంధ్రాలో భారీ రేటుకే బిజినెస్ ముగించేశారట. ఆరంభం నుండి డియర్ కామ్రేడ్ విషయంలో పలు రకాల న్యూస్ లు రావడంతో ఈ సినిమాకు ఒకింత మైనస్ గా మారె అవకాశాలు లేకపోలేదు. మరి వాటన్నిటికీ దాటుకుని కామ్రేడ్ హిట్ కొడితే ఆ రేంజే వేరప్పా !!