ఎన్టీఆర్ మళ్ళీ హోస్ట్ గా మారుతోన్న విషయం తెల్సిందే. నాలుగేళ్ల క్రితం బిగ్ బాస్ ను హోస్ట్ చేసిన ఎన్టీఆర్, ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం ద్వారా హోస్ట్ గా మారుతున్నాడు. రీసెంట్ గా ఈ షో షూటింగ్ మొదలైంది. ఈ ప్రోగ్రాంకు మొదటి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విచ్చేస్తున్న విషయం ఇప్పటికే బహిర్గితమైంది.
ఈ ఎపిసోడ్ ను ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టెలికాస్ట్ చేయనున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో హీరోలుగా నటిస్తోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ షో ద్వారా తమ చిత్ర ప్రమోషన్స్ ను కూడా ఈ కార్యక్రమం ద్వారా మొదలుపెట్టనున్నారు.
ఇక ఈ షో లో పాల్గొన్న రామ్ చరణ్ ప్రశ్నలకు చురుగ్గా సమాధానాలు చెప్పాడట. ఏకంగా 25 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు తెలుస్తోంది.
994289 507406You produced some decent points there. I looked on-line for any difficulty and discovered most individuals will go in conjunction with with your website. 522548