వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘టీఆర్ఎస్ తో పొత్తు ఉండొద్దనేది రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయం. దీనిని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. ఉప ఎన్నికకు వందల కోట్లు ఖర్చు చేస్తూ టీఆర్ఎస్, బీజేపీ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నాయి. వీరికి ఇంత డబ్బు ఎక్కడిదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉంది’.
‘దేశ సమైక్యత కోసమే జోడో యాత్ర చేపట్టాం. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ ప్రజల సమస్యలు వింటా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా. టీఆర్ఎస్, బీజేపీ ఒకే సిద్ధాంతంతో వెళ్తున్నాయి. సంపదను కొందరు వ్యాపారుల చేతుల్లో పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గుజరాత్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’ అని అన్నారు.
908587 697213Soon after I initially commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a remark is added I get four emails with the same comment. Is there any method you will be able to take away me from that service? Thanks! 504202
174811 871426Outstanding weblog here! after reading, i decide to buy a sleeping bag ASAP 702515