సాహో ఎఫెక్ట్ బాగా కొట్టినట్టుంది ప్రభాస్ కి అందుకే నెక్స్ట్ సినిమా జాన్ విషయంలో ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే యూరప్ లో ఓ షెడ్యూల్ పూర్తైన తరువాత ఈ స్కిప్ట్ విషయంలో ఆలోచనలో పడ్డారు .. స్క్రిప్ట్ ని మరోసారి పరిశీలించి మార్పులు చేసాక రెండో షెడ్యూల్ మొదలెడదామని అనుకున్నారు.
కానీ నవంబర్లోనే రెండో షెడ్యూల్ మొదలు కావాల్సి ఉన్నా కూడా ఇంతవరకు దానిగురించి ఎక్కడ ఊసేలేదు. రెండో షెడ్యూల్ కోసం ఫిలిం సిటీ లో సెట్ చేసారు .. కానీ అది పక్కన పెట్టి ప్రభాస్ యూరోప్ వెళ్ళాడు. మరో సినిమా విషయంలోనే ఆయన యూరోప్ వెళ్లినట్టు తెలుస్తోంది.
జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న జాన్ సినిమా గురించి మరచిపోవలసిందే అంటూ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ప్రభాస్ కానీ యూవీ నిర్మాతలు కానీ అసలు జాన్ సినిమా గురించి పట్టించుకోవడం లేదట. ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం ఇప్పటికే వంశీ పైడిపల్లి, అటు బాలీవుడ్ లో ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్ లతో చర్చలు జరుపుతున్నాడట. దాంతో జాన్ విషయం పక్కన పెట్టినట్టే అన్న టాక్ వినిపిస్తుంది. మరి ఈ విషయంలో దర్శకుడు ఎలా రియాక్ట్ అవుతాడో అన్నది ఆసక్తికరంగా మారింది.
