2021 ఏడాదికి సంబంధించి పలు రాంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను ప్రకటించింది. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాను ఈ సందర్భంగా విడుదల చేసింది. ఈ అవార్డుల్లో గానగంధర్వుడిగా భారతదేశ సినీ సంగీతంలో విశేష ఖ్యాతిని ఆర్జించిన నేపథ్య గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు మరో ఆరుగురికి పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి. వీరిలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఉన్నారు. వీరితోపాటు 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నలుగురికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. వీరిలో ఏపీకి చెందిన ముగ్గురు (అన్నవరపు రామస్వామి.. కళారంగం, ప్రకాశ్ రావు అసవడి.. సాహిత్యం, విద్య, నిడుమోలు సుమతి.. కళలు) తెలంగాణకు చెందిన ఒకరు (కనకరాజు.. కళలు) ఉన్నారు. ప్రముఖ గాయని చిత్రకు కేరళ ప్రభుత్వం కోటాలో పద్మభూషణ్ అవార్దు వరించింది.
605773 906202appreciate the effort you put into getting us this data. Was looking on google and located your post randomly. 506890