ఏపీ ప్రభుత్వంపై ఒడిశా రాష్ట్రం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇందుకు కారణం పంచాయతీ ఎన్నికలే. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో ఒడిశా భూభాగంలోని మూడు పంచాయతీలకు పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని ఒడిశా వాదిస్తోంది. దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది ఒడిశా ప్రభుత్వం. గంజాయ్ పదర్ ను గంజాయ్ భద్రగా, ఫట్టు సెనరీను పట్టు చెన్నూరుగా, ఫగు సెనరీని పగులుచెన్నూరుగా పేర్లు మార్చారని ఒడిషా తన పిటిషన్ లో పేర్కొంది.
ఈ మూడు పంచాయతీల్లో తాము గతంలోనే ఎన్నికలు నిర్వహించినట్టు కూడా పేర్కొంది. దీనిపై ఏపీ సీఎస్, ఎస్ఈసీ నుంచి సంజాయిషీ కోరి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఒడిశా సుప్రీంలో పిల్ దాఖలు చేసింది. ఈమేరకు ఒడిశా న్యాయవాది వికాస్ సింగ్ సుప్రీంకోర్టును కోరారు. ఈ అంశంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే ధర్మాసనం రేపు అత్యవసర విచారణకు జరిపేందుకు అంగీకరించింది.
499759 641113Thanks for taking the time to discuss this topic. I genuinely appreciate it. Ill stick a link of this entry in my blog. 270880
159671 744150I want searching at and I believe this site got some actually helpful stuff on it! . 521686