నేటి నుండి దేశ వ్యాప్తంగా 60 సంవత్సరాలు దాటిన వారికి ప్రభుత్వం నుండి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొదలు అయ్యింది. అందులో భాగంగా నేడు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ ను తీసుకున్నట్లుగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తాను కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నట్లుగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కోవిడ్ కు వ్యతిరేకంగా దేశంలో వైధ్య సిబ్బంది చేస్తున్న పోరాటంపై మోడీ ప్రశంసలు కురిపించారు. అందరం కలిసి త్వరలోనే కరోనా రహిత దేశంగా ఇండియాను మార్చాలని మోడీ పిలుపునిచ్చారు.
మోడీ ఏ టీకాను తీసుకోబోతున్నాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రస్తుతం దేశంలో రెండు రకాలు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అందులో ఒకటి భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్. మోడీకి కోవాగ్జిన్ టీకాను ఎయిమ్స్ సిస్టర్ నివేదా ఇచ్చారు. మోడీ ఈ సందర్బంగా ధరించిన డ్రస్ సాంప్రదాయ బద్దంగా ఉంది. అస్సాం ప్రజలు ఈ కండువాను మహిళల ఆశీస్సులకు చిహ్నంగా చెబుతూ ఉంటారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న కోవాగ్జిన్ కు డిమాండ్ బాగా పెరిగే అవకాశం ఉంది.
920376 849076Glad to be 1 of a lot of visitants on this awing internet internet site : D. 489165