Switch to English

మళ్లీ ఢిల్లీ పరిగెత్తి సంజాయషీ ఇచ్చుకుంటారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి దొరికే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పింఛన్ల పంపిణీలో జాప్యం, వరద బాధితులను పట్టించుకోకపోవడం, కియా సంస్థ ప్రతినిధులకు ఎంపీ బెదిరింపులు వంటి అంశాలపై లోకేశ్ తన ట్విట్టర్లో విరుచుకుపడ్డారు.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కియా కంపెనీ ప్రతినిధిని బెదిరించారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్లో పోస్టు చేసిన ఆయన.. ‘‘కియాలాంటి అంతర్జాతీయ సంస్థనే ఈ రేంజ్ లో బెదిరిస్తున్నారంటే, స్థానిక పెట్టుబడిదారులను మీ ‘జె-ట్యాక్స్’ కోసం ఎలా వణికిస్తున్నారో అర్థమవుతోంది. మీకు వీలైతే నాలుగు కంపెనీలను రాష్ట్రానికి తీసుకురండి. అంతేకానీ మా కష్టంతో తెచ్చిన కంపెనీలను మీ పులివెందుల పంచాయతీతో బెదిరించి తరిమేయకండి. మీ దౌర్జన్యాలకు బెదిరి, వాళ్లు వెళ్లి మోదీ గారి దగ్గర పంచాయతీ పెడితే, మొన్న ఢిల్లీలో ఉండి సంజాయిషీ ఇచ్చుకున్నట్టుగా మళ్లీ ఢిల్లీ పరుగెత్తాల్సి ఉంటుంది. అయినా మీ నాయనగారికి ఇచ్చిన మాట కోసం కియా వాళ్లిక్కడ ప్లాంటు పెట్టారని చెప్పుకుంటూ ఈ దాడులేంటి జగన్ గారూ’’ అని ఎద్దేవా చేశారు.

మరో ట్వీట్ లో కష్టపడేది ఒకరు.. రిబ్బన్ కట్ చేసేది మరొకరు అంటూ కియా కార్ల ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. వరద ముంపు బాధితులకు సహాయ సహకారాలు అందించే విషయంలోనూ ప్రభుత్వ పనితీరును లోకేశ్ విమర్శించారు. ‘‘మీరేమో కాసేపు గాలిలో చక్కర్లు కొట్టి మమ అనిపించారు. మీ మంత్రులు ఏదో షికారుకు వచ్చినట్లుగా వచ్చి వెళ్లారు తప్ప బాధితులను పట్టించుకోలేదు. ప్రకృతి విపత్తు సమయంలో ఇలాగేనా వ్యవహరించేది? ఇదేనా ప్రజలపట్ల మీ బాధ్యత’’ అని ప్రశ్నించారు.

ఇక రాష్ట్రంలో ఒకటో తారీఖుకి పింఛన్లు ఇవ్వకుండా నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. ‘‘ప్రమాణ స్వీకారం రోజున పింఛన్ల గురించి అట్టహాసంగా చెప్పుకున్నారు. మరుసటి నెల మీ తండ్రిగారి పుట్టినరోజు వరకు పింఛన్లు ఇవ్వకుండా పేదలను తిప్పించుకుని, మళ్లీ మీ గొప్పలను ప్రచారం చేసుకున్నారు. ఇంత ప్రచారం చేసుకుంటే ఇక నుంచైనా ఒకటో తారీఖున పింఛన్లు ఇస్తారని అనుకున్నాం. ఎనిమిది రోజులైనా ఈ అవస్థలేంటి సీఎం గారు’’ అని జగన్ పై లోకేశ్ విరుచుకుపడ్డారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....