గవర్నర్ తమిళిసై ఇటివల బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పని చేస్తే గౌరవిస్తాం. వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తూండటంతోనే సమస్యలు వస్తున్నాయి. ఎదుటివారికి గౌరవం ఇవ్వడంలో సీఎం కేసీఆర్ ఎంతో పరిపక్వతతో వ్యవహరిస్తారు. ప్రొటోకాల్ విషయంలో మా పరిమితులు మాకు తెలుసు. తమిళిసై గవర్నర్ హోదాలో పర్యటిస్తే స్వాగతిస్తాం కానీ.. బీజేపీ నాయకురాలిగా వస్తే ఎందుకు ప్రొటోకాల్ పాటిస్తాం.’
‘రాజ్యంగబద్ధంగా వ్యవహరించాల్సిన పదవిలో పార్టీ అధ్యక్షురాలని నియమించడంలో కేంద్ర ప్రభుత్వ ఆంతర్యం ఏమిటి..? ఎమ్మెల్సీలు ఎలా ఉండాలో గవర్నర్ చెప్పడం సరికాదు. రాజకీయాలు కూడా సేవా రంగం పరిధిలోకే వస్తాయి. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ వ్యవహారంలో ప్రభుత్వం పంపించిన సిఫార్సును ఆమోదించాలి. కానీ.. అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మావైపు నుంచి గవర్నర్ కు ఎటువంటి సమస్యా లేదు. గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వస్తుంది’ అని అన్నారు.
126465 309380I like this web site its a master peace ! Glad I detected this on google . 591683
832074 213696This is really intriguing, You are a very skilled blogger. Ive joined your rss feed and look forward to seeking a lot more of your magnificent post. Also, Ive shared your web internet site in my social networks! 402246
224290 549579Really great written write-up. It will probably be valuable to anybody who usess it, including myself. Maintain up the great function – canr wait to read much more posts. 153201