తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మంగళగిరి స్థానంలో ఎలాగైనా గెలవాలని పావులు కదుపుతోంది. అక్కడ నుంచి ఏపీ సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్ బరిలో ఉండటంతో గెలుపే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ఇందుకోసం అవకాశం ఉన్న ఏ మార్గాన్నీ విడిచిపెట్టడంలేదు. గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరిస్థితి మారిపోతుందేమోననే ఉద్దేశంతో అక్కడ అన్ని సేనలనూ మోహరిస్తోంది. ఇప్పటికే లోకేశ్ మంగళగిరి బరిలో ప్రచారంలో దూసుకుపోతుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో కూడా అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి.
వాస్తవానికి లోకేశ్ పోటీ చేస్తాడని భావించిన నియోజకవర్గాల జాబితాలో తొలుత మంగళగిరి లేదు. అయితే, అనూహ్యంగా ఆయన్ను మంగళగిరి బరిలో దింపుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతం కావడం.. అక్కడ ఐటీ కంపెనీలు రావడం.. అభివృద్ధి కనబడటం వంటి కారణాలతో లోకేశ్ గెలుపు సులభం అవుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పైగా ఆయన చేయించిన సర్వేల్లో సైతం సానుకూల ఫలితం రావడంతో తనయుడిని అక్కడే బరిలోకి దింపాలని నిర్ణయించారు. లోకేశ్ సైతం తనకు టికెట్ ఖరారు కాగానే రంగంలోకి దిగిపోయారు. ఆ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ గంజి చిరంజీవి ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. ఆయనకు కొన్ని హామీలిచ్చి అసంతృప్తి లేకుండా చూసుకున్నారు.
అయితే, వైఎస్సార్ సీపీ తరఫున అక్కడ పోటీ చేస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా గట్టి అభ్యర్థే. ఆర్థికంగా టీడీపీతో పోటీ పడలేకపోయినా, అంగబలంలో మాత్రం ఆళ్లను తక్కువ అంచనా వేయక్కర్లేదు. నియోజకవర్గంలో దాదాపు ప్రతి కుటుంబంతోనూ మమేకమైన వ్యక్తిగా ఆళ్లకు మంచి పేరుంది.
వైఎస్సార్ క్యాంటీన్ పేరుతో రూ.4కే పేదలకు భోజనం పెడుతున్న ఆళ్ల మీద స్థానికులకు మంచి అభిప్రాయమే ఉంది. సదావర్తి భూముల కుంభకోణంలో కోర్టులో పోరాడి స్థానికంగా ఆయన హీరో కూడా అయ్యారు. పైగా గత ఎన్నికల్లో తెలుగుదేశం అనుకూల పవనాలు ఉన్న సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం లోకేశ్ వర్సెస్ ఆళ్ల ఫైట్ టఫ్ గానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పైగా చరిత్ర చూస్తే మంగళగిరిలో తెలుగుదేశానికి అత్యంత చెత్త రికార్డు ఉంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులే గెలుస్తూ వచ్చారు. టీడీపీ ఆవిర్భవించిన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ ఆ పార్టీ విజయం సాధించింది. తర్వాత కమ్యూనిస్టులకు ఈ స్థానం కంచుకోటలా ఉంటూ వచ్చింది. గత ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్ సీపీ గెలిచింది. ఈ
పరిస్థితుల్లో ఈ సారి ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పని చక్కబెట్టుకుంటూ వస్తోంది. చోటా మోటా నాయకులందరినీ తనవైపు తిప్పుకునే పని ప్రారంభించింది. ఇప్పటికే అలాంటివారందరినీ గుర్తించి తాయిలాలు ముట్టజెప్పినట్టు సమాచారం.
ఒక్క రాత్రే ఏకంగా రూ.15 కోట్ల మేర పంపకాలు జరిగినట్టు చెబుతున్నారు. స్థాయిని బట్టి వారికి ప్రత్యేక హామీలు, తక్షణ నగదు బహుమతులు భారీ ఎత్తున ముట్టజెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అధికారంలోకి వస్తే చిన్న చిన్న కాంట్రాక్టులు వంటివన్నీ ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.
ఎంత ఖర్చుపెట్టైనా సరే లోకేశ్ ను గెలిపించడానికి తెలుగుదేశం పెద్దలు పావులు కదుపుతున్నారు. ఎంత ఖర్చు అయిన పర్వాలేదు.. మంగళగిరి మాత్రం గెలివాల్సిందే అని స్థానిక నేతలకు ఆదేశాలు జారీచేసేశారు. ఈ నియోజకవర్గంలో అతిపెద్ద కమ్యూనిటీగా ఉన్న చేనేతల ఓట్లే ఫలితాన్ని నిర్ణయిస్తాయి. వారంతా టీడీపీపై వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఆళ్ల గెలుస్తారా? లేక లోకేశ్ విజయం సాధిస్తారా అనేది ఉత్కంఠగా మారింది.
639305 53591Whoa! This blog looks just like my old 1! It is on a completely different subject but it has pretty a lot exactly the same layout and style. Outstanding choice of colors! 844663
197705 307609We maintain your page. Watch it offline once more soon. Quite fascinating write-up. 845033