ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు రెండొవ తనయుడు మంచు మనోజ్ హీరోగా టాలీవుడ్ లో నిలబడాలని గట్టిగానే ప్రయత్నాలు చేసాడు. అయితే ఆయనకు హీరోగా సక్సెస్ కంటే కూడా .. ఫెయిల్యూర్స్ ఎక్కువగా పలకరించాయి. దాంతో రకరకాల ప్రయోగాలు చేసాడు. అవికూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. మరో వైపు వైవాహిక జీవితంలో కూడా ఆటుపోట్లు వచ్చి .. అవి విడాకుల వరకు దారికి తీశాయి.
ఈ మధ్యే తన భార్యతో విడాకులు తీసుకున్న మంచు మనోజ్ దీపావళి సందర్బంగా తన ఆనందాన్ని తన అభిమానులతో పంచుకుంటూ కొత్త అవతారం ఎత్తనున్నట్టు ప్రకటించాడు. ఇన్నాళ్లు హీరోగానే ఉన్న మంచు మనోజ్ .. ఇకపై మంచు మనోజ్ ఆర్ట్స్ అనే బ్యానర్ ని మొదలెట్టాడు. ఈ బ్యానర్ పై కొత్త వారిని పరిచయం చేస్తూ సినిమాలు నిర్మించేందుకు రెడీ అయ్యాడు. సో ఇకపై మంచు మనోజ్ నిర్మాత అవతారంలో కనిపిస్తాడన్నమాట.
దీపావళి సందర్బంగా తన పేరు కలిసి వచ్చేలా ఎం ఎం ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపిస్తూ.. ఆ లోగో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులను పలకరించాడు. సో నిర్మాతగా మంచు మనోజ్ బ్యానర్ సరికొత్త తరహా సినిమాలు వస్తాయన్నమాట. ఇప్పటికే తన తండ్రి లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ఉంది . ఆ మద్యే మంచు లక్ష్మి మంచు ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ స్థాపించింది. ఇక మంచు విష్ణు ఇప్పటికే 24 ఫ్రేమ్స్ అనే బ్యానర్ పై సినిమాలు చేస్తున్నాడు.
196492 713659Just what I was searching for, appreciate it for posting . 867808
303109 319937Some truly outstanding articles on this internet site , thankyou for contribution. 284712
231989 264941This is a exceptional weblog, would you be involved in performing an interview about just how you designed it? If so e-mail me! 566602