Switch to English

మహర్షి సెంచరీ.. ‘మమ’ అన్పించేసిన మహేష్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, సెంచరీ క్లబ్‌లోకి చేరాలని చాలా కలలు కన్నాడు. వంద కోట్లు కొల్లగొట్టేశాం.. అని మహేష్‌ అభిమానులు తమ అభిమాన హీరో నటించిన చాలా సినిమాల విషయంలో ప్రచారం చేసుకున్నారు. ‘శ్రీమంతుడు’ సినిమాకీ, ‘భరత్‌ అనే నేను’ సినిమాకీ ఇలాగే ప్రచారం జరిగింది. మహేష్‌ కూడా ఆ దిశగానే సంకేతాలు పంపాడు అప్పట్లో. ఎలాగైతేనేం, ఇన్నాళ్ళకి మహేష్‌, సెంచరీ క్లబ్‌లో చేరిపోయాడు తన తాజా చిత్రం ‘మహర్షి’తో.

తాజాగా వెల్లడవుతున్న ట్రేడ్‌ రిపోర్ట్స్‌ ప్రకారం చూస్తే, మహేష్‌ నటించిన ‘మహర్షి’ సినిమా ఫుల్‌ రన్‌లో 101.17 కోట్ల దగ్గర ఆగిపోయింది. చూస్తోంటే, ఇదేదో కావాలని ఓ మూడు నాలుగు కోట్లు అదనంగా కలిపేసి, సెంచరీ అన్పించేశారేమో అన్న అనుమానాలు కలగడం సహజమే. నిజానికి, 93 కోట్ల దగ్గర ‘మహర్షి’ ఆగిపోయిందంటూ గతంలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారం సంగతి పక్కన పెడితే, అఫీషియల్‌గా ట్రేడ్‌ రిపోర్ట్స్‌ వచ్చేసినట్లే గనుక మహేష్‌ సెంచరీ కొట్టేసినట్లు భావించాల్సిందే.

‘బాహుబలి’ దెబ్బకి బాలీవుడ్‌ రికార్డులూ గల్లంతయిపోయినా.. వంద కోట్ల బిజినెస్‌ అనేది చాలా చిన్నదిగా మారిపోయినా.. ఇంకా తెలుగు సినిమా స్టామినా.. అనగానే, 100 కోట్ల గురించి లెక్కేసుకోవాల్సి రావడం బాధాకరమే. అయితే, 100 కోట్లు చిన్న విషయమేమీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో.

‘బాహుబలి’ని పక్కన పెడితే, వసూళ్ళ పరంగా టాప్‌ ప్లేస్‌లో వున్నది మాత్రం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ సినిమానే. ఆ తర్వాత కూడా మరో మెగా మూవీనే నిలిచింది. అదే మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రూపొందిన ‘ఖైదీ నెంబర్‌ 150’. ‘రంగస్థలం’ 127 కోట్లను ఫుల్‌ రన్‌లో వసూలు చేస్తే, ‘ఖైదీ నెంబర్‌ 150’ లెక్క 105 కోట్లు. ఇప్పుడు మహేష్‌ రాకతో, 100 కోట్ల క్లబ్‌లో నాన్‌ బాహుబలి సినిమాలు మూడున్నాయన్నమాట. ఈ లెక్క సరిపోదు.. ఇంకా ఇంకా కావాలి. అప్పుడే తెలుగు సినిమా స్టామినా ఇంకా గట్టిగా ప్రపంచానికి విన్పిస్తుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...