కొన్ని విషయాలు చూడటానికి చిన్నగానే కనిపిస్తాయి. కానీ వాటి ఫలితాలు మాత్రం తీవ్రంగానే ఉంటాయి. ఉద్దేశపూర్వకంగా జరిగిందో లేక తెలియకుండా జరిగిపోయిందో, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు చేసిన చిన్న తప్పిదం ఆయనకు ఇబ్బందిగా పరిణమించింది. మహేష్ వైఖరిపై జగన్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. సూపర్ స్టార్ కృష్ణ భార్య, ప్రముఖ దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన తర్వాత సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు ఆమె నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. కృష్ణను ఓదార్చారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా శుక్రవారం ఉదయం విజయ నిర్మల నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కృష్ణను ఓదార్చారు.
తాజాగా ఆదివారం ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, సినీనటుడు బాలకృష్ణ కృష్ణను పరామర్శించారు. ఈ సందర్భంలో మహేష్ బాబు అక్కడే ఉన్నారు. ఇదే ఇప్పుడు జగన్ అభిమానులకు ఆగ్రహం కలిగించింది. జగన్ వచ్చినప్పుడు మహేష్ బాబు ఆయన్ను కలవడానికి రాకుండా అవమానించారంటూ వారు మండిపడుతున్నారు. మహేష్ తీరు సరికాదని పేర్కొంటున్నారు.
దివంగత వైఎస్ హయాంలో లబ్ధి పొందినా కృతజ్ఞత చూపని ఇలాంటి సెలబ్రిటీలను జగన్ లెక్క చేయకూడదని సూచిస్తున్నారు. కృష్ణకు చెందిన పద్మాలయా స్టూడియో భూముల వివాదాన్ని దివంగత వైఎస్సార్ పరిష్కరించి ఆయనకు మేలు చేకూర్చారని, అలాగే సైనికుడు సినిమా విడుదల తర్వాత వరంగల్ లో ఓ వీడియో పార్లర్ యజమానిపై మహేష్ బాబు చేయి చేసుకున్నప్పటికీ, వైఎస్సార్ ఆయనపై ఎలాంటి కేసూ నమోదు కాకుండా చూశారని గుర్తు చేస్తున్నారు.
అలా కృష్ణ కుటుంబానికి మేలు చేసిన వైఎస్ కుటుంబాన్ని విస్మరించడం సరికాదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సమయం చూసి మహేష్ బాబుకు తగిన గుణపాఠం చెప్పాలని సోషల్ మీడియా ద్వారా జగన్ అభిమానులు ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వివాదంపై మహేష్ బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.
992232 921516for however an additional great informative post, Im a loyal reader to this weblog and I cant stress enough how much valuable information Ive learned from reading your content. I truly appreciate all the hard function you put into this wonderful weblog. 317242
158877 736309Some genuinely nice and utilitarian info on this internet site , likewise I feel the layout has fantastic features. 680101