Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతుంది. షూటింగ్ కాస్త ఆలస్యం అవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ హడావిడిగా చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే పూర్తి అయిందట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ లో కలిపి థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా రూ.150 కోట్ల ను దక్కించుకుందట. దాంతో రూ.160 కోట్ల వసూళ్లను గుంటూరు కారం వసూళ్లు చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయినట్లు అవుతుంది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే నిర్మాతలు నోరు విప్పాల్సిందే. సంక్రాంతికి మొత్తం అయిదు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి. అయిదు సినిమాల్లోకి అత్యంత క్రేజీ మరియు భారీ బడ్జెట్ సినిమా ఇదే. కనుక భారీ ఓపెనింగ్స్ తో పాటు భారీ వసూళ్లు ఈ సినిమా సాధించాల్సి ఉంది. మరి ఆ రేంజ్ వసూళ్లను ఈ సినిమా సాధిస్తుందా అనేది చూడాలి.