ఇటివల హైదరాబాద్ ను వరదలు అతలాకుతలం చేసాయి. ముఖ్యంగా పాతబస్తీతో సహా పలు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. నాలాలు పొంగి ప్రవహించాయి. ప్రజలంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ వరదలపై జాతీయస్థాయిలో చర్చ జరిగింది. నగర ప్రజల నుంచి తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఇటివల మంత్రి కేటీఆర్ వరద సాయం అందని వారు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు.
దీంతో ముంపుకు గురై ఇప్పటివరకూ సాయం అందుకోని ప్రజలు మీసేవ కౌంటర్ల వద్ద క్యూ కట్టారు. ఎక్కడికక్కడ భారీ క్యూలైన్లు కనిపించాయి. తమ పేరు నమోదు చేసుకున్న మరుసటి రోజునే 10వేలు తమ ఖాతాకు జమ అవుతున్న కారణం ఒకటైతే.. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ సాయం అందదో అనే ఆందోళనతో కూడా బాధితులు మీసేవ కేంద్రాలకు తరలి వచ్చారు. ఇప్పటికే చాలా మంది బాధితులకు తెలంగాణ ప్రభుత్వం వరద సాయం కింద 10వేలు అందించింది.
అయితే మరింత ఎక్కువ మందకి సాయం అందలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసిన ప్రకటన బాధితులకు ఊరటనిచ్చింది. దీంతో మీ సేవా కేంద్రాలకు పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా క్యూ కట్టారు. అంబర్ పేట, సీతాఫల్ మండి, మారేడ్ పల్లి, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, వనస్థలిపురం.. తదితర ప్రాంతాల్లో బాధితులు పోటెత్తారు.
944309 120598I enjoy what you guys are up too. Such clever function and exposure! Keep up the really excellent works guys Ive incorporated you guys to my own blogroll. 602811
652046 214639Hi, you used to write superb posts, but the last several posts have been kinda boring I miss your great posts. Past few posts are just slightly bit out of track! 463461