కెజిఎఫ్ .. గత ఏడాది కన్నడలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం కెజిఎఫ్. కెజిఎఫ్ .. ఒక్క కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా సంచలన విజయం అందుకుంది. కన్నడ బాహుబలి గా ఓ రేంజ్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీ దృష్టి ని ఆకర్షించాడు.
ఆయనతో సినిమా చేయడానికి పలువురు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ దర్శకుడు మాత్రం తెలుగు స్టార్స్ తో సినిమా చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.ఇదివరకే ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత ప్రభాస్ తో కూడా చేస్తున్నట్టు ప్రచారం జరిగింది.
Also Read: సరిలేరు నీకెవ్వరూ: రష్మిక కంటే, రాములమ్మకే ఎక్కువా.!
ప్రస్తుతం కెజిఎఫ్ 2 సినిమా తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తో చేస్తాడని ప్రచారం జరుగుతుంది. దానికి అసలు కారణం ఏమిటంటే .. నిన్న ఆదివారం సాయంత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకుడు ప్రశాంత్ చర్చలు జరిపినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్గా మారింది. అంటే ఈ దర్శకుడి నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తో ఉంటుందన్న మాట. మరి ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే .. వెయిట్ అండ్ సి !!
