హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కదిలే కారులో బాలికపై అత్యాచార ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఘటనపై విచారణ జరిపి తీసుకున్న చర్యలపై వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.
‘మే31న తన కుమార్తెపై దాడి జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక తండ్రి నాకే ఫిర్యాదు చేస్తే పోలిస్ స్టేషన్ కు పంపించాను. ఘటన జరిగిన షాక్ లో వారు 3రోజుల వరకూ కేసు పెట్టలేకపోయారు. వారు ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. పూర్తి సాంకేతిక ఆధారాలతో వివరాలు సేకరించాం. 28న జరిగిన పార్టీకి బాలిక వెళ్లింది. నిందితులతో ముందు పరిచయం లేకపోవడంతో పూర్తి వివరాలు చెప్పలేకపోతోంది. ఒక నిందితుడి పేరు చెప్పడంతో అదుపులోకి తీసుకున్నాం’.
‘ఘటనపై అత్యాచారం, పోక్సో చట్టంతోపాటు మరిన్ని సెక్షన్లతో కేసు నమోదు చేశాం. బాలిక చెప్పిన వివరాలతో సీసీటీవీ ఫుటేజీని సేకరించి ఐదుగురు నిందితులను గుర్తించాం. ఇందులో ముగ్గురు 16,17 ఏళ్లలోపు వారే. పబ్ లో నిబంధనలు అతిక్రమిస్తే వారిపైనా చర్యలు తీసుకుంటాం. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని బాలిక చెప్పలేదు. పబ్ పార్టీపై ఇంకా విచారణ చేయలేదు. బాలిక కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరో 48 గంటల్లో మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేస్తాం. బాధితురాలి ఫొటో, పేర్లు వెల్లడించిన మీడియాపై కూడా చర్యలు తీసుకుంటాం’.
‘ఘటనకు సంబంధించి పుప్పాలగూడ వాసి సాదుద్దీన్ మాలిక్ ను అరెస్టు చేశాం. మరో నిందితుడు మైనర్ గా గుర్తించాం. రాత్రిపూట మైనర్ ను అదుపులోకి తీసుకోకూడదు కాబట్టి రేపు ఉదయం అదుపులోకి తీసుకుంటాం. ఓ ప్రజాప్రతినిధి కుమారుడి పాత్ర ఉన్నట్టు ఆధారాలు లభించాయి.. మైనర్ కారణంగా వివరాలు వెల్లడించలేకపోతున్నాం. హోంమంత్రి మనవడి ప్రమేయం ఉందనేది నిరాధారమైన ఆరోపణలు. ఎమ్మెల్యే కుమారుడు ఘటనలో ఉన్నాడనేందుకు ఆధారాలు లభ్యం కాలేదు. నిందితులు ఎంతటివారైన శిక్ష పడేలా చేస్తాం’
367278 87109Hey! Nice stuff, do tell us when you post something like that! 673052