నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు సినిమా థియేటర్లలో దాదాపుగా 50 కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా మరో సూపర్ హిట్ అన్నట్లుగా ప్రచారం జరిగింది. అలాంటి జాతి రత్నాలు సినిమా ఏం బాగుంది.. దీన్ని ఎందుకు ఇంత పెద్ద హిట్ చేశారు అంటూ కొందరు కామెంట్స్ చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జాతి రత్నాలు సినిమాకు ఓటీటీ ఆడియన్స్ ద్వారా నెగటివ్ కామెంట్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది.
జాతిరత్నాలు సినిమాను ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఓటీటీ లో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. థియేటర్లలో జనాలు తెగ ఎంజాయ్ చేస్తే ప్రైమ్ లో చూసిన వారు మాత్రం ఏముందని ఇందులో ఇంత విజయాన్ని సొంతం చేసుకుందని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నెట్టింట జాతిరత్నాలు విడుదల అయిన ఇన్ని రోజుల తర్వాత విమర్శలు ఎదురవుతున్నాయి. పూర్తి గా ఎంటర్ టైన్ మెంట్ సినిమా అయిన జాతి రత్నాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల్లోకి ఎక్కకుండా ప్లాప్ టాక్ తెచ్చుకుందంటున్నారు.