2019 ఎన్నికల్లో అధికారంలోకి రాకముందే.. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అధికారంలోకి వస్తూనే, తన ఆలోచనల్ని అమల్లోకి తీసుకొచ్చేశారు. ఏడు నెలలపాటు అమరావతిని అయోమయంలోకి నెట్టేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఈ రోజు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారట.
ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల అంశంపై విస్పష్టమైన ‘ప్రకటన’ చేసేసిన వైఎస్ జగన్, ఆ దిశగానే నివేదికల్ని జీఎన్ రావు కమిటీ నుంచీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నుంచీ తెప్పించుకున్నారు. ఆ నివేదికలపై హైపర్ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ నుంచి కూడా తనకు అనుకూలంగానే నివేదిక తెప్పించుకోబోతున్నారు వైఎస్ జగన్. ఈ రోజు హైపర్ కమిటీ చివరి సమావేశం జరగనుండగా, ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్నే అసెంబ్లీలో చర్చకు పెట్టనుంది అధికార పక్షం. ఎటూ అధికారపక్షానికి అసెంబ్లీలో బంపర్ మెజార్టీ వుంది గనుక, ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏ బిల్లు అయినా పాస్ అయిపోతుంది. అంటే, నిర్ణయం జరిగిపోయాక.. దాన్ని అమల్లోకి తెచ్చేందుకోసం ఓ ప్రసహనం జరుగుతోందన్నమాట ఇఫ్పుడు. ఈ మాత్రందానికి కమిటీలెందుకు.? అంటే, అది ఖచ్చితంగా కాలయాపన కోసమే.
హైకోర్టుని కర్నూలుకి తరలిస్తే అది రాజధాని అయిపోతుందా.? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో ఉత్తరాంధ్రని నిజంగానే ఉద్ధరించేస్తారా.? ఏమోగానీ, ఒక్కటి మాత్రం నిజం.. అమరావతి పరిస్థితి ఇప్పటికే దయనీయంగా తయారైంది.. ముందు ముందు మరింత దుర్భరం కానుందన్నది మాత్రం నిష్టురసత్యం.
thanks
63111 777534Thanks for providing such a terrific post, it was superb and extremely informative. It is my initial time that I go to here. I discovered lots of informative stuff within your article. Maintain it up. Thank you. 212525
439660 951816 There is noticeably a bundle to know about this. I assume you produced certain good points in features also. 983418