Switch to English

మడమ తిప్పిన జగన్‌: చంద్రబాబు ఇంటి జోలికి వెళ్ళరట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

కృష్ణా నదీ గర్భంలోకి చొచ్చుకు వెళ్ళిన కొన్ని ప్రత్యేక నిర్మాణాలకు సంబంధించి ‘పగలగొట్టుడు’ వ్యవహారం ఈ మధ్యనే ప్రారంభమయ్యింది. ముఖ్యమంత్రి అవుతూనే, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న తొలి నిర్ణయం ప్రజా వేదికను కూల్చేయడం. కోట్లాది రూపాయల ప్రజాధనం మట్టిపాలైపోయింది ఆ సంఘటనతో. పోయింది జనం సొమ్ము కదా, వైఎస్‌ జగన్‌ జేబులో సొమ్ము కాదు కాబట్టి.. ఆయన చాలా ధైర్యంగా ఆ నిర్ణయం తీసేసుకున్నారు. చంద్రబాబు నివాసం వుంటోన్న ఇంటిని కూల్చేయడం వైఎస్‌ జగన్‌ అసలు లక్ష్యమనీ, ఆ ఘనకార్యం చేపట్టడానికి ముందుగా ప్రజా వేదికను కూల్చేశారనీ వైఎస్సార్సీపీ నేతలే చెబుతున్న విషయం.

ప్రజా వేదిక కూలింది.. చంద్రబాబు ఇల్లు మాత్రం అలాగే వుంది. ఇక్కడ చంద్రబాబుకి వచ్చిన కష్టమేమీ లేదు. పార్టీ కార్యకలాపాలకోసం, ప్రతిపక్ష నేతగా ప్రజల్ని కలిసేందుకోసం ప్రజావేదికను కోరిన చంద్రబాబుకి ఆ భవనాన్ని ఇచ్చేసి, అద్దెను వసూలు చేసినా.. అది రాష్ట్రానికి ఎంతో కొంత ఉపయోగపడేది. పోనీ, ప్రజా వేదికను కూల్చేశాక.. చంద్రబాబు ఇంటికి వెళ్ళి అధికారులు.. కనీసం, గేటు అయినా పగలగొట్టారా.? అంటే అదీ లేదు.

చంద్రబాబు ఇంటి సమీపంలో మరో వ్యక్తికి చెందిన ఓ నిర్మాణాన్ని పగలగొట్టారు అధికారులు. ఆ తర్వాత మళ్ళీ వ్యవహారం సైలెంటయిపోయింది. చంద్రబాబు నివాసం వుంటోన్న ఇంటి యజమాని కోర్టుకు వెళ్ళారు, ప్రభుత్వం పంపిన నోటీసులపై. దాంతో, ఈ వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఈ చర్యలతో వైఎస్‌ జగన్‌ అహం తగ్గుతుందేమోగానీ, చంద్రబాబుకి వచ్చిన నష్టమేమీ లేదని చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు.

పైగా, ఇక్కడ వైఎస్‌ జగన్‌ అహం కూడా తగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే, ఏదీ ప్రభుత్వానికి అనుకూలంగా జరగడంలేదు కాబట్టి. ఇక్కడ మేటర్‌ క్లియర్‌.. వైఎస్‌ జగన్‌ దూకుడు ప్రదర్శించడానికి వీల్లేదు. అంటే, ఆయన ‘మడమ’ తిప్పేసినట్లే. లేదూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భవనాన్ని కూల్చేసి, చంద్రబాబుని రోడ్డున పడేయాలనే సంకల్పంతో ఇంకా గట్టిగా ముందడుగు వేస్తే.. అది జగన్‌ మీద చాలా నెగెటివ్‌ ఇంపాక్ట్‌ చూపుతుంది.

అమరావతి నిర్మాణాన్ని పక్కన పెట్టి, పోలవరం ప్రాజెక్టుని పట్టించుకోకుండా.. ప్రజా వేదికను కూల్చేసి, చంద్రబాబు ఇంటిని కూల్చేయాలనుకోవడం హేయమైన చర్య కాకపోతే మరేమిటి.? ఇదే విషయమై పార్టీ నేతలు వైఎస్‌ జగన్‌ని ఎంత వారిస్తున్నా ఆయన వినడంలేదట. ‘ఇకనైనా పద్దతి మార్చుకుంటే మంచిది.. లేదంటే ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది.. చంద్రబాబుకి అనవసరంగా మనమే ఎనర్జీ ఇచ్చినట్లవుతుంది..’ అంటూ సీనియర్‌ నేతలు పలువురు వైఎస్‌ జగన్‌కి తాజాగా క్లాస్‌ తీసుకున్నారట. ఆ క్లాస్‌ గనుక ఫలిస్తే, జగన్‌ వెనుకడుగు వేస్తారేమో వేచి చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...