Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: భవిష్యత్‌ సినిమా ఇలాగే వుంటుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాజకీయాలు, కులాల ప్రస్తావనలు, ప్రాంతాల గొడవలు.. సినీ పరిశ్రమకి కూడా ఎప్పటినుంచో లింక్‌ చేయబడుతున్నాయి. ఈ విషయంలో ఎవర్నీ తప్పుపట్టలేమని అంటున్నారు సీనియర్‌ ప్రొడ్యూసర్‌ సురేష్‌బాబు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత అయిన సురేష్‌బాబు విద్యాధికుడు. అంతకు మించి, ఆయనకు విషయ పరిజ్ఞానం చాలా ఎక్కువ. ఏ విషయాన్ని అయినా ఆయన కుండబద్దలుగొట్టేస్తారు. చాలా వివాదాల్లో ‘ఆ నలుగురు’ అనే మాట వచ్చినప్పుడల్లా అందులో సురేష్‌బాబు పేరు పరోక్షంగా విన్పిస్తుంటుంది.

ప్రధానంగా సినిమా థియేటర్లు, లీజులు, చిన్న సినిమా గొడవల సమయంలో ‘ఆ నలుగురి పెత్తనం సినీ పరిశ్రమకు శాపం’ అని అంటుంటారు. అలా అనుకునేవారి విషయంలో తానేమీ మాట్లాడలేననీ, ఎవరి ఇష్టం వారిదని సురేష్‌బాబు తేల్చి చెప్పారు. భవిష్యత్‌ సినిమా గురించి మాట్లాడుతూ, థియేటర్ల వ్యాపారం ఎక్కువ కాలం మనుగడ సాధించేలా కన్పించడంలేదని చెప్పారాయన.

‘పదేళ్ళు ఈ రంగానికి పెద్దగా ముప్పు వుండదని భావించాం. కానీ, ఇప్పుడు మేలుకోకపోతే, రెండేళ్ళలోనే థియేటర్ల ట్రెండ్‌ వాష్‌ ఔట్‌ అయిపోవచ్చు..’ అని సురేష్‌బాబు చెప్పుకొచ్చారు. ‘ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిస్తే.. కొంతమందికి ఉపాధి దొరుకుతుందేమో.. కానీ, థియేటర్లు వెలవెలబోతే పరిస్థితి ఏంటి.? వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ ఎత్తేశారు.. అక్కడ సినిమా థియేటర్లు ఎలా వున్నాయి.? అని మనం అధ్యయనం చేయడానికి ఓ అవకాశం దొరికింది. అందుకే తొందరపాటు అనవసరం..’ అని సురేష్‌బాబు చెబుతున్నారు.

‘నారప్ప’ సినిమా విషయానికొస్తే, ఆ సినిమా కోసం కొంత షూటింగ్‌ చేయాల్సి వుందనీ, రోజుకి 100 మందికి పైగా ఆర్టిస్టులు అవసరమనీ, కేవలం 50 మందితో సినిమా షూటింగ్‌ చేయాలంటే కుదిరే పని కాదనీ, ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ళు సినిమా విషయాన్ని పక్కన పెట్టేశాననీ ఓ ఇంటర్వ్యూలో సురేష్‌బాబు చెప్పుకొచ్చారు. ‘సినిమా మీద ప్యాషన్‌ వుంటేనే ఈ రంగంలో రాణించగలం. బ్యాక్‌గ్రౌండ్‌ వున్నా, ప్యాషన్‌ లేకపోతే రాణించడం కష్టం..’ అని తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేశారు.

ఇక, సినిమాకి సంబంధించి చాలా మార్పులొచ్చాయి. తాను కూడా ఓటీటీ వైపు వెళతానని సురేష్‌బాబు స్పష్టం చేశారు. ‘కథ చెప్పడం ముఖ్యం. దాన్ని వెండితెర మీద చెప్పడమా.? ఓటీటీ మీద చెప్పడమా.? అన్నదే ఇప్పుడు ప్రశ్న. టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిందే. టీవీ రంగం విస్తరించింది.. ఓటీటీ కూడా అంతే..’ అని అంటున్నారు సురేష్‌బాబు.

సినీ పరిశ్రమలో తాజా వివాదాలు కొద్ది రోజుల్లోనే సమసిపోతాయనీ, అలా సమసిపోవడం సినీ పరిశ్రమలో ఎవరికీ ఆశ్చర్యం కాబోదని బాలయ్య వివాదంపై స్పందించారు సురేష్‌బాబు. కొన్నేళ్ళ క్రితం తన సినిమా ‘విశ్వరూపం’ విడుదలకు సంబంధించి వివాదాలు తలెత్తడంతో.. తన సినిమాని డైరెక్టుగా డీటీహెచ్ విధానంలో విడుదల చేయాలనుకున్నారు అప్పట్లో సీనియర్ నటుడు కమల్ హాసన్. ఏమో, భవిష్యత్తులో థియేటర్లు పూర్తిగా కనుమరుగై.. ఇంట్లోనే సినిమా చూడాల్సి వస్తుందేమో.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...