సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వెల్లడించిన సంగతి తెల్సిందే. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారు పాట అనే చిత్రాన్ని చేయనున్నాడు మహేష్. విడుదల చేసిన ప్రీ లుక్ ను బట్టి ఇది పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రమని, మహేష్ ఇందులో మాస్ యాంగిల్ లో కనిపిస్తాడని అర్ధమవుతోంది. ఇప్పటిదాకా క్లాస్ సినిమాలే తీస్తూ వచ్చిన పరశురామ్ మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే ఈ ప్రీ లుక్ తో పటాపంచలు అయిపోయాయి. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలవుతుంది అని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అయితే మొదటి షెడ్యూల్ సెప్టెంబర్ లో మొదలైనా అందులో మహేష్ పాల్గొనడు అంటున్నారు. మహేష్ ఇప్పటికే టీమ్ కు అక్టోబర్ నుండి షూటింగ్ కు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే సెప్టెంబర్ లో మహేష్ లేని సన్నివేశాలను చకచకా చిత్రీకరించేయాలని పరశురామ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో మొదటి షెడ్యూల్ జరగనుంది. రెండో షెడ్యూల్ నుండి మహేష్ పాల్గొంటాడు. ఇక మహేష్ కు హీరోయిన్ గా కియారా అద్వానీ, సయీ మంజ్రేకర్ పేర్లను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు కీలకమైన మహేష్ తండ్రి పాత్ర కోసం వేట కూడా మొదలైంది. మరికొన్ని రోజులు ఆగితే అన్ని విషయాల్లోనూ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
347340 629342Perfect just what I was looking for! . 671411
498840 636347I extremely glad to discover this website on bing, just what I was searching for : D as effectively saved to favorites . 420122
68125 731196Just a smiling visitor here to share the really like (:, btw outstanding layout. 198939
305513 312134Completely composed written content , thanks for details . 488353