సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. ఏదేమైనా ఈ చిత్రం సంక్రాంతికి వచ్చి తీరుతుందని ఇటీవలే నిర్మాత బల్లగుద్ది మరీ చెప్పడంతో సూపర్ స్టార్ అభిమానుల్లో ఒకింత ఉత్సాహం వచ్చింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఇదేనంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
టైటిల్ కి తగ్గట్లే గుంటూరు కేంద్రంగా ఈ చిత్రం జరుగుతుంది. అక్కడ జరిగే అక్రమ కార్యకలాపాలను ఒక లేడీ జర్నలిస్ట్ వెలికితీయాలని ప్రయత్నించడం, ఆపదలో పడిన ఆమెకు గుంటూరు కారం వంటి ఘాటైన యువకుడు జతవ్వడం.. ఈ రకంగా గుంటూరు కారం స్టోరీలైన్ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇదే నిజం అనే సమాచారం ఎక్కడా లేదు.
శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు.